malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…
malladi vishnu: మంత్రి వర్గ విస్తరణ నిర్ణయం జగన్ ఒక్కరికి మాత్రమే తెలుస్తుందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మంత్రి వర్గ విస్తరణపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. రేపటి సమావేశంలో విస్తరణ సమాచారం గురించి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించే సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేదేనని తెలిపారు.
Read Also: KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
సంక్షేమ పథకాల అమలు, గడప గడపకి ప్రభుత్వం అమలు తీరు రేపటి సమావేశం ప్రధాన అజెండా అని మల్లాది విష్ణు వెల్లడించారు. టీడీపీ వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారం ఎలా తిప్పికొట్టాలో రేపటి భేటీలో చర్చిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్దమని టీడీపీ చెప్పినా ఇంటికి పంపటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కొందరు నమ్మక ద్రోహం, సంస్థాగత లోపల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని ఆయన మండిపడ్డారు. వైసీపీకి 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని టీడీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. నిన్న అనంతపురంలో పల్లె రఘునాథ్ రెడ్డి ఓవరాక్షన్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ బలంగా ఉందని నమ్మించటానికి రాష్ట్రంలో పలుచోట్ల జరిగే అల్లర్లు జరగడమే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పించారు.
Also Read
తాజావార్తలు
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
-
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
-
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!