ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు మళ్ళీ ఒక ఆ తీపి కబురు అందించింది. పరిశ్రమలోని రైతులపై విద్యుత్ భార భారాన్ని తగ్గించే లక్ష్యంతో యూనిట్ విద్యుత్ను కేవలం రూ. 1.50కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారికంగా జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500కి పైగా ఆక్వా ఫారాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.
ఆక్వా రంగంలో సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో.. ఈ విద్యుత్ సబ్సిడీ రైతులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. సాగు వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తి పెరగడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో మన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు మరింత విస్తరించేందుకు ఆస్కారం లభిస్తుంది.
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రోత్సాహక చర్యలను చేపడుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు విద్యుత్ ఛార్జీల తగ్గించి రైతులకు అండగా నిలిచింది. కరెంట్ కష్టాల నుంచి ఉపశమనం లభించడంతో ఆక్వా రంగానికి సరికొత్త ఉత్తేజం లభించనుంది. ఉత్పాదకత పెరిగి, రైతులకు మంచి ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు.

