Site icon NTV Telugu

AP Cabinet: రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. యుద్ధ వాతావరణంపై చర్చ!

Ap Cabinet

Ap Cabinet

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47 వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Rohit Sharma Retirement: రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ అంతంత మాత్రమే.. గణాంకాలు ఇవే!

తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై గురువారం క్యాబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రధాని మోడీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్‌లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది.

 

Exit mobile version