AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

Ap Cabinet

Ap Cabinet

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ రాష్ట్ర పారిశ్రామిక, పరిపాలనా రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇవే..

సుమారు రూ.39,436 కోట్ల పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. విశాఖను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా మార్చేలా అదానీ, గూగుల్ అనుబంధ సంస్థల ఏఐ డేటా సెంటర్, ఐటీ పార్కుల ఏర్పాటుకు భూమి కేటాయించారు. అమరావతిలో సి-డాక్ భాగస్వామ్యంతో అత్యాధునిక ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెమీకండక్టర్లు: శ్రీ సత్యసాయి జిల్లాలో RRP ఎలక్ట్రానిక్స్ ద్వారా రూ.10,240 కోట్ల సెమీకండక్టర్ యూనిట్ ను స్థాపించనున్నారు.

Also Read:Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

పరిశ్రమలు: కుప్పంలో లిథియం బ్యాటరీల ప్లాంట్, నెల్లూరులో శామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంపునకు గ్రీన్ సిగ్నల్.

ద్యోగ నియామకాల కోసం పాత 4 జోన్ల వ్యవస్థను రద్దు చేసి, 6 జోన్లుగా పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. దీంతో పాటు.. ప్రైవేట్ వర్సిటీల స్థాపన నిబంధనల సరళీకరణ, చారిత్రక కట్టడాల పరిరక్షణకు ‘అడాప్ట్ ఏ మాన్యుమెంట్’ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.