Dowry Harassment: వద్దన్నా వదల్లేదు.. కత్తితో గొంతు కోసి చంపి గోనెసంచిలో పెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: రోజు రోజుకు సమాజంలో మానవత్వం కనుమరుగైపోతుంది. ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితికి మనిషి దిగజారి..క్రూరంగా మారిపోతున్నాడు. తనను నమ్మి వచ్చిన వారిని అత్యంత కిరాతకంగా చంపి రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడు. ఢిల్లీలో శ్రద్ధా దారుణ హత్య మరవక ముందే.. తాజాగా రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన 25 రోజులకే ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి అతి క్రూరంగా హతమార్చాడు. అంతేకాకుండా ఆమె శవాన్ని గోనె సంచిలో పెట్టి అడవిలో పడేశాడు. అజ్మీర్ జిల్లాలోని క్రిస్టియన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Read Also: Zakir Naik : మేం ఆయనను పిలువలేదు.. జకీర్ ఖాన్ పై క్లారిటీ ఇచ్చిన ఖతార్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఈ దంపతులు 26 రోజుల క్రితం ప్రేమవివాహం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా నగర్ స్ట్రీట్ నంబర్-4లో నివసించే ముఖేష్ సింధీ (34) నయాబజార్లో బట్టల షాప్ నడుపుతున్నాడు. గతేడాది ఆగస్టులో ముఖేష్ స్నేహితుడు రమేష్ .. భగవాన్ గంజ్లో నివసించే జెన్నిఫర్ (32)ని పరిచయం చేశాడు. ఇద్దరు ప్రేమించుకుని 26 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. బుధవారం ఉదయం ముఖేష్, జెన్నిఫర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. నన్ను క్షమించండి, ఇంకా ఎప్పుడూ అలా చేయనని జెన్నిఫర్ .. తన భర్తను వేడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతసేపటికి ఇంట్లో నుంచి శబ్దాలు ఆగిపోయాయని.. కొంతసేపటికి ముఖేష్ .. ఓ గొనె సంచితో బయటికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సంచిని స్కూటీపై ఉంచుతుండగా కిందపడినప్పుడు ఆమె మృతదేహాన్ని చూసినట్లు వారు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read Also:Udayanidhi Stalin: కొడుక్కి మళ్లీ కీలక పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళం పగలగొట్టి పరిశీలించారు. అక్కడ రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. ఇంతలో.. మృతదేహాన్ని బయట పడేసి ముఖేష్ ఇంటికి వచ్చాడు. అక్కడ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు కలెక్టరేట్ సమీపంలో ముఖేష్ ను పట్టుకున్నారు. పోలీసుల తమదైనశైలి విచారించగా తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని పుష్కర్ ప్రాంతంలో పడేసినట్లు భర్త చెప్పాడు. ప్రస్తుతం నిందితుడు ముఖేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. జెన్నిఫర్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆమె తల్లి పెంచింది. బాధితురాలి సోదరుడు ముఖేష్ కట్నం డిమాండ్ చేస్తున్నాడని .. ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..