Poacher Trailer : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు ప్రస్తుతం మంచి క్రేజ్ వుంది.వాటిలో క్రైమ్ సిరీస్ లకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ జానర్ లో వచ్చిన సిరీస్ లలో చాలా వరకూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నవే.ఇప్పుడు అలాంటిదే మరో క్రైమ్ సిరీస్ పోచర్ ఓటీటీలోకి రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా ఈసారి కేరళ అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ ను ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు.బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రిచీ మెహతా డైరెక్షన్ లో వస్తున్న సిరీస్ కావడంతో ఈ పోచర్ పై ఆసక్తి నెలకొంది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్ చుట్టూ ఈ కథ నడుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. గురువారం (ఫిబ్రవరి 15) ఈ ట్రైలర్ ను ఆలియా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.”ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇదీ ఒకటి” అనే క్యాప్షన్ తో ఆలియా సిరీస్ ఈ ట్రైలర్ ను షేర్ చేసింది. కేరళ అడవుల్లో ఓ ఏనుగును ఓ ముఠా మట్టుబెట్టే సీన్ తో ట్రైలర్ మొదలువుతుంది.
1990ల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్లీ యాక్టివ్ అయిందంటూ ఈ రాకెట్ ను ఇన్వెస్టిగేట్ చేసే టీమ్ మాట్లాడుకుంటూ ఉంటుంది.అసలు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద క్రైమ్ రాకెట్ లేదు అన్నట్లుగా ట్రైలర్ లో చూపించారు.. దీని విలువ ఏకంగా రూ.కోటి కోట్లని ట్రైలర్ చివర్లో చెప్పడం సమస్య తీవ్రత ఏంటో మేకర్స్ తెలియజేశారు.పోచర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా వెల్లడించారు.ఈ పోచర్ వెబ్ సిరీస్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆలియా.. దీనిని బాగా ప్రమోట్ చేస్తోంది. ఈ మధ్యే తాను అడవిలో ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ అడవిలో ఏనుగులను చంపుతున్న తీరుపై ఆ వీడియోలో ఆలియా మాట్లాడింది. అక్కడ కనిపించిన ఓ రైఫిల్, బుల్లెట్ కేసింగ్స్ మరియు ఓ ఏనుగు కళేబరం ఆలియాను భయపెడతాయి.ఏనుగుల వేట ఎంత పెద్ద రాకెటో చెప్పే ప్రయత్నంలో భాగంగా తాను ఒక రోజు ఆ అడవిలో గడిపానని, కానీ ఆ సమయంలోనే అక్కడి దారుణాలు చూసి తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె చెప్పడం విశేషం.. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ పోచర్ సిరీస్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలియజేశారు…
Also Read
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
- Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!