కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఎమ్మెల్యేలు మంత్రులు మొదటి వార్షికోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 12 న జరగాల్సిన కూటమి మొదటి వార్షికోత్సవ సభ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వాయిదా పడింది.
Suparipalana Tholi Adugu: సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో వార్షికోత్సవ సభ.. ఎల్లుండే
- ఎల్లుండి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ సభ
- సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్న ప్రభుత్వం

Chandrababu