NTV Telugu Site icon

Anil Ambani: అనిల్‌ అంబానీకి ఎదురుదెబ్బలు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు

Anei

Anei

అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తన గ్రూప్‌లోని ఒక సంస్థకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అనిల్‌కు ఊహించని ఎదురుదెబ్బతో షాక్ అయ్యారు. రూ.8,000 కోట్లు కోల్పోవల్సిన దుస్థితి ఏర్పడింది. అనిల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అనిల్ అంబానీకి గట్టి షాక్ తగిలినట్టైంది. 2008లో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్‌.. ప్రస్తుతం ఆ జాబితాలోనే కనిపించకుండా పోయారు. కొన్నేళ్లుగా ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు మరింత షాకిచ్చినట్లైంది.

2008లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు అనుబంధ కంపెనీ అయిన డీఏఎమ్‌ఈపీఎల్‌, ప్రభుత్వ రంగ సంస్థ డీఎమ్‌ఆర్‌సీలు ఒక కన్సెషన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిపై వచ్చిన వివాదం విషయంలోనే డీఎమ్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా 2021లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దానిపై డీఎమ్‌ఆర్‌సీ దాఖలు చేసిన క్యూరేటివ్‌ విజ్ఞప్తిని అంగీకరించిన ప్రత్యేక ధర్మాసనం.. తాజాగా అనిల్‌ అంబానీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సరైన నిర్ణయమే తీసుకుందని.. అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదని చెబుతూ అంత క్రితం ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పన్కనపెట్టింది.

2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం.. డీఏఎమ్‌ఈపీఎల్‌కు డీఎమ్‌ఆర్‌సీ రూ.2782.33 కోట్లు చెల్లించాలి. 2022 ఫిబ్రవరి 14 నాటికి ఒప్పంద నిబంధనల ప్రకారం ఇది రూ.8,009.38 కోట్లకు చేరింది. ఇందులో రూ.1678.42 కోట్లను డీఎమ్‌ఆర్‌సీ చెల్లించింది. మరో రూ.6,330.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాజా తీర్పుతో అనిల్‌ కంపెనీ రూ.1678.42 కోట్లను డీఎమ్‌ఆర్‌సీకి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రూ.6,330.96 కోట్లనూ వదులుకోవాల్సి ఉంటుంది.