సుప్రీం కోర్టులో అనిల్ అంబానీకి చుక్కెదురైంది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.