Site icon NTV Telugu

Ramoji Rao: రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి.. రేపు, ఎల్లుండి సంతాప దినాలు

Ramoji Rao Enadu Chairmen

Ramoji Rao Enadu Chairmen

Ramoji Rao: ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. రామోజీరావు మృతికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు.

Read Also: Chiranjeevi : రామోజీరావు మరణంతో తెలుగుజాతి పెద్దదిక్కును కోల్పోయింది..

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించగా.. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.

Exit mobile version