AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీ-ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్లో పాల్గొని, రాష్ట్రంలో ఆక్వా రంగం ప్రాధాన్యతను, బ్లూ ఎకానమీ ద్వారా సాధించగల ఆర్థిక వృద్ధిని వివరించారు. భవిష్యత్తు అంతా బ్లూ ఎకానమీదేనని స్పష్టం చేసిన ఆయన, ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా సముద్రం మీద రాతలా బలంగా సాగాలని ఆకాంక్షించారు.
పెట్టుబడిదారులకు భరోసా..
రాష్ట్రంపై నమ్మకంతో ఇన్నోవేషన్స్తో ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు తాను ఎల్లప్పుడూ ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు. అలాగే కాకినాడ పోర్ట్ మోడ్రనైజేషన్ (ఆధునీకరణ) చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేవలం 15 రోజుల్లోనే కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
Also Read
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
దేశ ఆక్వా రంగంలో ఏపీ తిరుగులేని రారాజు..
భారతదేశ సముద్ర ఆహార రంగంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. దేశంలో సీ-ఫుడ్ ఉత్పత్తిలో ఏపీ రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఉత్పత్తి జరుగుతోంది. భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతం కాగా, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో 38 శాతం ఆదాయం ఒక్క ఏపీ నుంచే వస్తోంది. దీని ద్వారా రాష్ట్రం నుంచి ఏటా రూ. 28,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ అవకాశాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్లో భారతదేశ వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉందని, అయితే ఈ రంగంలో దేశానికి ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఏపీలో ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసి, బ్లూ ఎకానమీని పెంచడం ద్వారా దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో మరిన్ని ఆవిష్కరణలు (ఇన్నోవేషన్స్) చేస్తే, భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ప్రపంచస్థాయిలో ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!