Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh Budget 2025 26 Finance Minister Pyyavula Keshav Presents 3 22 Lakh Crore

AP Budget 2025: బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారంటే..

Published Date :February 28, 2025 , 10:54 am
By Kothuru Ram Kumar
  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌
  • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌
  • రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌.
AP Budget 2025: బడ్జెట్‌లో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Budget 2025: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

Read Also: AP Budget 2025: బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్‌..

ఇక బడ్జెట్‌లో కీలక కేటాయింపుల విషయానికి వస్తే.. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అనేక రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, బీసీ సంక్షేమం, ఎస్సీ-ఎస్టీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించిందో వివరాలు ఇలా ఉన్నాయి.

* మొత్తం బడ్జెట్: రూ.3.22 లక్షల కోట్లు,

* వెన్యూ వ్యయం – రూ.2,51,162 కోట్లు,

* మూలధన వ్యయం – రూ.40,635 కోట్లు,

* రెవెన్యూ లోటు – రూ.33,185 కోట్లు,

* ద్రవ్య లోటు – రూ.79,926 కోట్లు

* బీసీల సంక్షేమానికి – రూ.47,456 కోట్లు,

* పాఠశాల విద్యాశాఖకు – రూ.31,805 కోట్లు,

* ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం – రూ.27,518 కోట్లు,

* ఎస్సీల సంక్షేమానికి – రూ.20,281 కోట్లు,

* వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి – రూ.19,264 కోట్లు,

* పంచాయతీ రాజ్‌ శాఖకు – రూ.18,847 కోట్లు,

* జలవనరుల శాఖకు – రూ.18,019 కోట్లు,

* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు – రూ.13,862 కోట్లు,

* ఇంధన శాఖకు – రూ.13,600 కోట్లు,

* వ్యవసాయ అనుబంధ రంగాలకు – రూ.13,487 కోట్లు,

* తల్లికి వందనం కోసం – రూ.9,407 కోట్లు,

* ఆర్‌అండ్‌బీకి – రూ.8,785 కోట్లు,

* గృహ మంత్రిత్వ శాఖకు – రూ.8,570 కోట్లు,

* ఎస్టీల సంక్షేమానికి – రూ.8,159 కోట్లు,

* గృహ నిర్మాణ శాఖకు – రూ.6,318 కోట్లు,

* అల్పసంఖ్యాక వర్గాల కోసం – రూ.5,434 కోట్లు,

* మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి – రూ.4,332 కోట్లు,

* పౌరసరఫరాల శాఖకు – రూ.3,806 కోట్లు,

* డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి – రూ.3,486 కోట్లు,

* పరిశ్రమలు, వాణిజ్య శాఖకు – రూ.3,156 కోట్లు,

* జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం – రూ.2,800 కోట్లు,

* దీపం 2.0 పథకానికి – రూ.2,601 కోట్లు,

* ఉన్నత విద్యకు – రూ.2,506 కోట్లు,

* నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు – రూ.1,228 కోట్లు,

* ఆదరణ పథకానికి – రూ.1000 కోట్లు,

* స్వచ్ఛాంధ్ర కోసం – రూ.820 కోట్లు,

* యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు – రూ.469 కోట్లు,

* మత్స్యకార భరోసాకు – రూ.450 కోట్లు,

* ఆర్టీజీఎస్‌ కోసం – రూ.101 కోట్లు,

* తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం – రూ.10 కోట్లు,

* మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి – రూ.10 కోట్లు.

ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా వ్యవసాయ, విద్య, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు అనేక ప్రోత్సాహక పథకాలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Budget 2025
  • AP Assembly
  • AP Budget 2025
  • AP Budget 2025-26
  • Finance Minister Pyyavula Keshav

తాజావార్తలు

  • YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

  • Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

  • Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

  • Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

  • AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions