Real Estate: దేశంలోని టాప్ 7నగరాల్లో రియల్ ఎస్టేట్ బూమ్.. రూ.3.50లక్షల కోట్ల ఆస్తుల విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Estate: దేశంలోని టాప్ 7 నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ లో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడు నగరాల్లో విక్రయిస్తున్న ఇళ్ల సంఖ్య పరిమాణం పరంగా చూస్తే 36 శాతం పెరిగింది. దాని విలువ 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు సృష్టించింది. మొత్తంగా 48 శాతం పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ఖరీదు చేసే ఇళ్లకు డిమాండ్ పెరిగిందని నివేదిక పేర్కొంది. గత మూడేళ్లలో దీని వాటా 5 శాతం నుంచి 20 శాతానికి పైగా పెరిగింది.
Read Also:IIT Madras: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. వరసగా ఐదో ఏడాది ఫస్ట్ ర్యాంక్..
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ గ్రూప్ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో నివాస ప్రాపర్టీ అమ్మకాలు 48 శాతం పెరిగి రూ. 3.47 ట్రిలియన్లకు చేరుకోనున్నాయి. సంవత్సరంలో విక్రయించిన మొత్తం గృహాల సంఖ్య 36 శాతం వృద్ధిని సాధించింది. యూనిట్ల సంఖ్య 379,000కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం 2023లో విలువ, వాల్యూమ్ పరంగా అత్యధిక మార్కెట్ వాటాను సాధించింది. గణాంకాల ప్రకారం, విక్రయించబడిన మొత్తం ఇళ్లలో 30 శాతం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవి మొత్తం రూ.1.67 లక్షల కోట్లకు విక్రయించబడ్డాయి. ఇది విలువ పరంగా మొత్తం మార్కెట్ వాటాలో 48 శాతం. విక్రయించిన ఇళ్ల సంఖ్య విషయానికొస్తే ముంబై తర్వాత పూణే వాటా 17శాతం మరియు ఢిల్లీ వాటా 16శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే పూణేలో విక్రయించిన మొత్తం ఇళ్ల విలువలో 77 శాతం పెరుగుదల ఉంది. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్లను కలిగి ఉన్న లగ్జరీ హౌసింగ్ విభాగంలో వరుసగా రెండో ఏడాది విక్రయించిన మొత్తం యూనిట్లు భారీగా పెరిగాయి.
Read Also:Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం నీవల్ల కాదు..
వాల్యూమ్ల పరంగా ఈ గృహాల మొత్తం మార్కెట్ వాటా 2022లో 10 శాతం నుండి 2023లో 20 శాతానికి పెరుగుతుందని అంచనా. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా 5 శాతంగా ఉంది. విలాసవంతమైన ఇళ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. విలాసవంతమైన హౌసింగ్లో ఇలాంటి పెరుగుదలకు కారణం మెరుగైన ఇంటి యాజమాన్యం, మెరుగైన సంపాదన, లైఫ్స్టైల్, రీసేల్ వాల్యూ గ్రోత్ పరంగా భవిష్యత్తుకు తగినట్లుగా ఉండే గృహాల కోరిక పెరిగిందని అనరాక్ చైర్మన్ అనూజ్ పూరి అన్నారు. వీటి కోసం ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత, లగ్జరీ రియల్ ఎస్టేట్లో అనూహ్య పెరుగదల కనిపించింది.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!