T Shirt: పిల్లలు నీటిలో పడిపోయినప్పుడు వారు మునిగిపోకుండా ఓ కంపెనీ వినూత్న డ్రెస్ తయారు చేసింది. ఈ డ్రెస్ ను చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముచ్చటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ నెట్టింట్లో షేర్ చేశారు. ఫ్రాన్స్కు చెందిన ఫ్లోటీ అనే కంపెనీ ఓ టీషర్టును రూపొందించింది. ఓ చిన్నారి బొమ్మకు ఆ టీషర్లు తొడిగి తొట్టిలో పడేశారు. వెంటనే ఆ టీషర్ట్ బెలూన్లా ఉబ్బి లైఫ్ జాకెట్లా మారింది. దీంతో ఆ బొమ్మ నీటిపై తేలింది. పిల్లలు కూడా ఈ డ్రెస్ వస్తే మునిగిపోరు.
Read Also:Wrestlers Protest: జంతర్ మంతర్ దగ్గర నో పర్మిషన్… ట్విట్టర్లో పేర్కొన్న ఢిల్లీ పోలీసులు
ఓ ప్రతిభావంతుడి మేధస్సు నుంచి వెలుగు చూసిన ఈ ఆవిష్కరణ గొప్పదిగా చెప్పుకోవాలి. చిన్నారులు అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడక వచ్చిన చిన్నారులు ఇల్లంతా కలియ తిరుగుతుంటారు. ఈ క్రమంలో నీటి బకెట్, సంపుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. అలాగే, వరదల సమయంలోనూ చిన్నారుల ప్రాణాలకు రిస్క్ ఉంటుంది. ఈ సమయంలో వారిని ఎవరో ఒకరు కాపాడే వరకు ప్రాణాలతో సురక్షితంగా ఉంచే ఆవిష్కరణ ఇది. ఈ ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర మెచ్చుకున్నారు.
Read Also:BJP: శ్రద్ధా వాకర్కు న్యాయం జరగలేదు.. ఇప్పుడు మరో హిందూ బాలికను బలైంది.
This may not get a Nobel prize but it ranks higher than those inventions for me. Because as the grandfather of two young kids, their wellbeing & safety is my highest priority. 👏🏽👏🏽👏🏽 (video credit: @Rainmaker1973 ) pic.twitter.com/ZaSyVMqZG9
— anand mahindra (@anandmahindra) May 25, 2023