Amit Shah: వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై అమిత్ షా స్పష్టత
- లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ
- ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నయన్న షా
- వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను, తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ బోర్డులో ముతవల్లీ ముస్లిం మాత్రమే ఉంటారని తెలిపారు. అన్యమతానికి చెందిన ఏ సభ్యుడినీ అనుమతించబోమని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి అమిత్ షా పరిపాలనా ప్రయోజనాల కోసం బోర్డులు, కౌన్సిల్లలో ముస్లిమేతర సభ్యులను నియమించవచ్చని స్పష్టం చేశారు. ” హిందూ, జైన లేదా సిక్కు ఛారిటీ కమిషనర్ వేరే మతానికి చెందినవారు లేరా? మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారు. 2013 లో మీరు చేసిన పని వల్లే ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చాం. వక్ఫ్ ఆస్తుల ఖాతాలను ఉంచవద్దని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. ఈ డబ్బు పేద ముస్లింలకు చెందినది. ధనిక బోర్డుకు కాదు. వక్ఫ్ మతపరమైనది. కానీ దాని బోర్డు మతపరమైనది కాదు.” అని అమిత్ షా స్పష్టం చేశారు.
READ MORE: Team India Schedule: స్వదేశంలో జరిగే టీమిండియా మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. వైజాగ్లో మ్యాచ్
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
వక్ఫ్ బిల్లుపై హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఈ బిల్లుకు తాను మద్దతు ఇస్తున్నానని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి జరుగుతున్న చర్చను తాను జాగ్రత్తగా విన్నానన్నారు. సభ్యుల మనస్సులలో చాలా అపోహలు ఉన్నాయని చెప్పారు.. ఆ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. బిల్లుపై జరిగిన చర్చకు సంబంధించి రిజిజు స్పందిస్తారన్నారు. తాను కొన్ని విషయాలను స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. “వక్ఫ్ అనేది అరబిక్ పదం. దీని చరిత్ర కొన్ని హదీసులతో ముడిపడి ఉంది. నేడు దీని అర్థం అల్లాహ్ పేరిట ఆస్తిని దానం చేయడం. ఈ అర్థం ఇస్లాం రెండవ ఖలీఫా ఉమర్ కాలంలో ఉనికిలోకి వచ్చింది. వక్ఫ్ అనేది ఒక రకమైన ధార్మిక దానం. ముస్లిం సభ్యులు తమ సొంత సంపాదన మాత్రమే దానం చేస్తారు. ప్రభుత్వ ఆస్తి లేదా ఇతరుల ఆస్తి దానం చేయరు.” అని అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!