Aamir Khan: బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామి సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఈ చిత్రం కేవలం వసూళ్లలోనే కాదు, రికార్డుల వేటలోనూ సరికొత్త చరిత్రను లిఖించింది. అదిత్య ధర్ దర్శకత్వంలో రన్వీర్ సింగ్ మెయిన్ రోల్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజా ఈ చిత్ర కలెక్షన్స్పై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు దక్కిన స్క్రీన్ల కంటే మరిన్ని థియేటర్లు అందుబాటులో ఉండి ఉంటే సినిమా వసూళ్లు ఊహకందని రీతిలో ఉండేవని అభిప్రాయపడ్డారు. చైనాలో దాదాపు లక్ష స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో ఆ సంఖ్య కేవలం 9 వేల లోపే ఉందని ఆయన గుర్తు చేశారు. గతేడాది చైనాలో విడుదలైన ‘నె ఝా 2’ అనే చిత్రం ఏకంగా 2 బిలియన్ డాలర్ల (రూ.18వేల కోట్లు పైచిలుకు) వసూళ్లను సాధించిందని, దానికి కారణం అక్కడ ఉన్న థియేటర్ల సంఖ్యేనని అన్నారు. ‘ధురంధర్’ 5 వేలకుపైగా స్క్రీన్లలో ప్రదర్శితమై 115 మిలియన్ డాలర్లు (రూ.1000 కోట్లు పైచిలుకు) సాధించింది, 15 వేల థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగేవి అని అన్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.