Verity Eating Habbit : ఇదేం అలవాటు.. పరుపులను పూరీల్లా తింటున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Verity Eating Habbit : జిహ్వకో రుచి పుర్రెకో ఆలోచన అన్న సామెత వినే ఉంటారు. అదే విధంగా చాలా మందికి వింత వింత అలవాట్లు ఉంటాయి. కొందరు పెయింట్, గ్యాసోలిన్, జిగురు వాసనను ఇష్టపడతారు. కాగితాలు, మట్టి, చాక్ పీసులను తింటుంటారు. అలాంటి అలవాట్లు సాధారణంగా హానిచేయవు.. మరోకరి ఆరోగ్యానికి వాటి వల్ల ఎటువంటి ముప్పు ఉండదు. అయితే, కొన్ని అలవాట్లు హద్దులు దాటినప్పుడు, సమస్యలు తలెత్తుతాయి. అవి వారి పాలిట వ్యసనంగా మారతాయి. జెన్నిఫర్ అనే మహిళకు అలాంటి వింత అలవాటు ఉంది.
అమెరికాకు చెందిన జెన్నిఫర్కు పరుపులు, కారు సీట్లు తినడం అలవాటు. రానురాను ఇప్పుడు ఆమె దానికి బానిస అయ్యింది. అమెరికన్ మీడియాలో ‘మై స్ట్రేంజ్ అడిక్షన్’లో గెస్ట్గా కనిపించిన జెన్నిఫర్, పరుపులు తినే వింత అలవాటు గురించి వివరంగా మాట్లాడింది. తాను రెండు దశాబ్దాలుగా పరుపులు తింటున్నట్లు వెల్లడించింది. ఆమెకు ఐదేళ్లు ఉన్నప్పుడే అలవాటు ప్రారంభమైంది, ఆమె వారి ఇంట్లో కార్ సీట్ల నుండి స్పాంజ్లు తినడం ప్రారంభించినట్లు తెలిపింది.
Also Read
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
Read Also: K.Raghavendra Rao: డిజిటల్ బాట పట్టిన రాఘవేంద్రుడు.. ఆరంభించిన దర్శకధీరుడు
తాను ప్రతిరోజూ ఒక చదరపు అడుగు పరుపు తినగలనని జెన్నిఫర్ పేర్కొంది. జెన్నిఫర్ mattress మొత్తం అయిపోవడం.. లేదా mattress నుంచి దుర్వాసన వచ్చినప్పుడు మాత్రమే తినడం ఆపుతానంటుంది. జెన్నిఫర్ ఒక రోజు తన సొంత పరుపు మొత్తం తిన్నానని.. అనంతరం తన తల్లి పరుపు తినడం మొదలుపెట్టడంతో విషయం బయటపడిందని తెలిపింది.
తనకు తిండి పిచ్చి ఎక్కువగా ఉందని.. కానీ ఆ క్రమంలో వేరే ఆహారం తీసుకోకుండా mattressనే తింటానంది. ఇప్పటి వరకు తన అలవాటు వల్ల ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదని జెన్నిఫర్ చెప్పింది. అయితే, పరుపులు తిన్న తర్వాత తనకు గ్యాస్ సమస్యలు వస్తాయని ఆమె అంగీకరించింది. మెట్రెస్ తిన్న తర్వాత జెన్నిఫర్ టాయిలెట్ని ఉపయోగించడం వల్ల టాయిలెట్ పైపు బ్లాక్ అయిపోందని చెప్పింది.
Read Also:KotamReddy Sridhar Reddy: నమ్మకద్రోహం మాటకు బాధేసింది
అదే ఇప్పుడు ఇంటి వారికి ఇబ్బందిగా మారింది. కానీ జెన్నిఫర్ని పరీక్షించిన వైద్యుడు.. mattress తినడం మానేయకపోతే, ఆమె ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని.. ఆమె కాలేయం, ప్రేగులకు ప్రమాదం ఏర్పడుతుందని, ఇది ఆమె మరణానికి దారితీస్తుందని హెచ్చరించాడు. ఇది విని ఆశ్చర్యపోయిన జెన్నిఫర్ ఇప్పుడు తన అలవాటును వదులుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. డాక్టర్ హెచ్చరికల నేపథ్యంలో జెన్నిఫర్ కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..