Amazon : భారత్ లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్.. సీఈఓ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మోడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఇరుదేశాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతో సంభాషించారు. ఈ క్రమంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ మోడీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మోడీ తో చర్చలు ఫలవంతంగా జరిగినట్లు చెప్పారు. భారత్ లో ఇప్పటికే 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టామని, రాబోవు రోజుల్లో మరో 15 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెడతామని సీఈవో ప్రకటించారు. అప్పుడు అమెజాన్ భారత్ లో పెట్టిన పెట్టుబడుల మొత్తం 26 బిలయన్ డాలర్లకు చేరుతుందన్నారు. మున్ముందు నెలకొల్పబోయే భాగస్వామ్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Read Also:Viral News: ఇదెక్కడి దారుణం.. అధికారి భార్య చెప్పులిప్పించాడని అటెండర్ బట్టలిప్పించారు?
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్జీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మోడీతో అమెజాన్ సీఈఓ సమావేశమయ్యారని, భారత్ లో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడుల గురించి చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. భారత్ లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలైజ్ చేయాలనే అమెజాన్ కార్యక్రమాన్ని మోడీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా చివరి రోజు వాషింగ్టన్ లో దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. అధునాతన సాంకేతికత, పరిశోధన అభివృద్ధిలో అమెరికా, భారత్ సంస్థాగత సహకారాన్ని బలపరచుకునేందుకు అవకాశాల గురించి చర్చించారు.
Read Also:Wagner Mutiny: రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్స్కీ
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!