Amazon : భారత్ లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్.. సీఈఓ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మోడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఇరుదేశాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతో సంభాషించారు. ఈ క్రమంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ మోడీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మోడీ తో చర్చలు ఫలవంతంగా జరిగినట్లు చెప్పారు. భారత్ లో ఇప్పటికే 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టామని, రాబోవు రోజుల్లో మరో 15 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెడతామని సీఈవో ప్రకటించారు. అప్పుడు అమెజాన్ భారత్ లో పెట్టిన పెట్టుబడుల మొత్తం 26 బిలయన్ డాలర్లకు చేరుతుందన్నారు. మున్ముందు నెలకొల్పబోయే భాగస్వామ్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Read Also:Viral News: ఇదెక్కడి దారుణం.. అధికారి భార్య చెప్పులిప్పించాడని అటెండర్ బట్టలిప్పించారు?
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్జీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మోడీతో అమెజాన్ సీఈఓ సమావేశమయ్యారని, భారత్ లో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడుల గురించి చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. భారత్ లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలైజ్ చేయాలనే అమెజాన్ కార్యక్రమాన్ని మోడీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా చివరి రోజు వాషింగ్టన్ లో దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. అధునాతన సాంకేతికత, పరిశోధన అభివృద్ధిలో అమెరికా, భారత్ సంస్థాగత సహకారాన్ని బలపరచుకునేందుకు అవకాశాల గురించి చర్చించారు.
Read Also:Wagner Mutiny: రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్స్కీ
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..