మెగా.. అల్లు కుటుంబాల్లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలో నయానికా రెడ్డి (Nayanika Reddy) తో ఏడడుగులు వేయబోతున్నారు. మార్చి 6వ తేదీన వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన తమ్ముడి కోసం హైదరాబాద్లో ఒక గ్రాండ్ ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే, ఈ పార్టీలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కనిపించడంపై కొందరు నెటిజన్లు విమర్శలు చేయగా.. వారికి అల్లు శిరీష్ తనదైన శైలిలో చురకలు అంటించారు.
Also Read : Mahesh Babu : జార్జియాకు సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు సెండాఫ్ ఇచ్చిన నమ్రత, సితార.. వీడియో వైరల్!
అల్లు శిరీష్ వివాహ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే చరణ్ అయ్యప్ప మాలలో ఉండి ఇలాంటి పార్టీలకు హాజరుకావడం ఏంటని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన అల్లు శిరీష్.. విమర్శకుల నోళ్లు మూయించేలా వివరణ ఇచ్చారు.. ‘రామ్ చరణ్ ఆ పార్టీకి చాలా తొందరగా వచ్చారు. అప్పటికి అక్కడ ఎవరూ లేరు, పార్టీ కూడా మొదలుకాలేదు. కనీసం ఎవరూ ఆల్కహాల్ కూడా ముట్టుకోలేదు. ఆయన కేవలం మమ్మల్ని విష్ చేసి, ఫోటో దిగి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయ్యప్ప స్వామి మాల పట్ల ఆయనకు ఉన్న భక్తి శ్రద్ధలను ఎవరూ ప్రశ్నించలేరు’ అని శిరీష్ గట్టిగా బదులిచ్చారు.
రామ్ చరణ్ గత 20 ఏళ్లుగా ప్రతి ఏటా నిష్టతో అయ్యప్ప మాలను ధరిస్తూ వస్తున్నారు. షూటింగ్లలో బిజీగా ఉన్నా సరే మాల నిబంధనలను ఆయన ఏమాత్రం అతిక్రమించరని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అల్లు శిరీష్ ఇచ్చిన ఈ క్లారిటీతో రామ్ చరణ్పై వస్తున్న తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.
