Akhilesh Yadav : పూలమాల వేసే విషయంలో గొడవ.. అఖిలేష్ యాదవ్ ఎదుటే తన్నుకున్న కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav : సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం కన్నౌజ్ చేరుకున్నారు. ఆయన చిబ్రమావులోని ఓ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. రోడ్డుపై పార్క్ చేసిన కారులో ఆయన కూర్చున్నారు. ఆయన సమీపంలోనే ఇద్దరు కార్యకర్తలు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో, అక్కడ నిలబడి ఉన్న ఇతర కార్యకర్తలు వారిని శాంతింపజేశారు.
Read Also:Tarang Shakti 2024: ప్రారంభమైన తరంగ్ శక్తి 2024.. మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే ?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అఖిలేష్ యాదవ్కు పూలమాల వేసే సమయంలో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం, గొడవ జరిగినట్లు సమాచారం. గొడవపడుతుండగా వారిద్దరూ అఖిలేష్ కారు ముందుకి చేరుకున్నారు. ఇంతలో భద్రతా సిబ్బంది కూడా శాంతించేందుకు ప్రయత్నించారు. అఖిలేష్ను కలిసేందుకే ఈ దాడి ఘటన జరిగిందని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా అఖిలేష్, రాహుల్ గాంధీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన ఫుల్పూర్లో చోటుచేసుకుంది. ఇక్కడ రాహుల్ గాంధీ, అఖిలేష్ బహిరంగ సభ జరిగింది. అయితే తొక్కిసలాట అనంతరం నేతలిద్దరూ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ రాగానే కార్యకర్తలు అదుపు తప్పారు. బారికేడ్లను బద్దలుకొట్టి వేదికపైకి చేరుకోవడం ప్రారంభించారు. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు.
Read Also:Symptoms of Heart Attack: గుండెపోటు వస్తుందని ముందే హెచ్చరించే లక్షణాలు ఇవే..!
.రాహుల్, అఖిలేష్ల సంయుక్త ర్యాలీ ఫూల్పూర్లోని పందిలాలో జరగాల్సి ఉంది. ఇద్దరు నేతలు ఎస్పీ అభ్యర్థి అమర్నాథ్ మౌర్యకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించేందుకు వచ్చినప్పటికీ తొక్కిసలాట జరిగింది. దీంతో నేతలిద్దరూ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత ముంగారి, ప్రయాగ్రాజ్లో రాహుల్, అఖిలేష్ల ర్యాలీ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్కు చెందిన ఉజ్వల్ రమణ్ సింగ్కు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఇరువురు నేతలు ప్రసంగించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!