Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

  • బెంగాల్ రాజకీయాల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ వివాదం..
  • టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థికి బహిరంగంగా వార్నింగ్..
  • ఆయన బీజేపీ ఏజెంట్ అంటూ అఖిలేష్ యాదవ్ ఫైర్..
Ajay Pal Sharma

Ajay Pal Sharma

Ajay Pal Sharma: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వాతావరణ మరింత వేడెక్కింది. రెండో దశ ఎన్నికలు బుధవారం జరుగబోతున్నాయి. గెలుపోటముల్ని నిర్ణయించే ఈ దశ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి నెలకొంది. అయితే, ఓటింగ్‌కు ముందు ఉత్తర్ ప్రదేశ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ పేరు మార్మోగుతోంది. అజయ్‌ను ఎన్నికల సంఘం ఉత్తర 24 పరగణాల జిల్లాకు ఎన్నికల పరిశీలికుడిగా పంపింది.

Read Also: The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

అయితే, టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు అజయ్ పాల్ శర్మ వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ కావడంతో టీఎంసీ అతడిపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇదే కాకుండా, ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా అజయ్ పాల్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ‘‘బీజేపీ ఏజెంట్’’ అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.

అజయ్ పాల్ శర్మ టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి ముందు నిలబడి, ఆయన కుటుంబ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. ‘‘జహంగీర్‌కు నచ్చచెప్పి, ప్రజల్ని బెదిరించడం ఆపండి. లేకపోతే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరిస్తు్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ పశ్చిమ బెంగాల్‌లో పరిశీలకుల పేరుతో బీజేపీ రాంపూర్, సంభాల్ ఏజెంట్లనున పంపింది. కానీ వారు ఏం సాధించలేరు. అక్కడ దీదీ ఉన్నారు, అక్కడే ఉంటారు. సరైన సమయం వచ్చినప్పుడు బీజేపీ, దాని మిత్ర పక్షాల ఏజెంట్లపై చర్యలు తీసుకుంటాము’’ అని హెచ్చరించారు.