Air India: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో, ఎయిర్ ఇండియా తన మధ్యప్రాచ్య సర్వీసులన్నింటినీ తక్షణమే నిలిపివేసింది. ముఖ్యంగా దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ వంటి నగరాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది.
READ ALSO: Iran Supreme Leader Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం..?
ఆపరేషన్ రోరింగ్ లయన్..
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రోరింగ్ లయన్” ఇరాన్పై దాడులను ఉధృతం చేసింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగడంతో గల్ఫ్ ప్రాంతమంతా గగనతలం (Airspace) మూతపడింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI139), గగనతలంలో ప్రమాదాన్ని పసిగట్టి మధ్యలోనే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్, అబుదాబి, రియాద్, జెడ్డా, దమ్మామ్, ఖతార్ (దోహా), ఒమన్ (మస్కట్), ఇజ్రాయెల్ (టెల్ అవీవ్)లకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో కూడా అప్రమత్తమైంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా స్థితిగతులను నిశితంగా గమనిస్తున్నామని, పరిస్థితిని బట్టి విమాన వేళల్లో మార్పులు చేస్తామని పేర్కొంది. ప్రయాణికులు తమ విమాన స్థితిని (Flight Status) ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే బ్రిటన్.. ఇరాన్ నుంచి తన సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఫ్రాన్స్ & ఇటలీ కూడా తమ పౌరులను తక్షణమే ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాలను విడిచి రావాలని ఆదేశించాయి. జర్మనీ.. ఇజ్రాయెల్ ప్రయాణాలపై కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మీరు గల్ఫ్ దేశాలకు ప్రయాణించాల్సి ఉంటే, విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్లో మీ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
READ ALSO: Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
