Air India Express: మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు.. నాలుగు గంటల్లో 15 లీటర్ల మందు తాగేసిన ప్రయాణికులు
- సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రారంభం
- నాలుగు గంటల్లో 15 లీటర్ల మందు తాగేసిన ప్రయాణికులు
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express: గుజరాత్లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మొదటి విమానాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ పూర్తిగా బుక్ అయిన ఫ్లైట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ప్రయాణికులు తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడంతో ఈ ప్రయాణం మరింత వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ ప్రయాణంలో ప్రయాణికులు అధిక మద్యం వినియోగించడమే ఇందుకు కారణం. విమానంలో ప్రయాణికులు దాదాపు 15 లీటర్ల ప్రీమియమ్ మద్యం, అందులో చివాస్ రిగల్, బకార్డీ, బీర్ వంటి పానీయాలను కలిపి దాదాపు రూ. 1.8 లక్షల విలువైన మద్యం వినియోగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రయాణికుల మద్యం వినియోగం ఎక్కువగా ఉండటంతో బ్యాంకాక్కు చేరుకునే ముందునే మద్యం అయిపోయిందని విమాన సిబ్బంది ప్రకటించాల్సి వచ్చింది.
Also Read: MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..
Also Read
ఈ ప్రయాణంలో ప్రయాణికుల కోసం తీసుకుని వచ్చిన గుజరాతీ వంటకాలు ముఖ్యంగా థెప్లా, ఖమన్ వంటి ఐటెంలు, అలాగే పిజ్జా వంటి ఇతర భోజనాలు అందరినీ ఆకర్షించాయి. ఇవి విమానంలో అందించిన ఫుడ్, డ్రింక్స్కు చక్కటి కాంబినేషన్ గా నిలిచాయి. మొత్తం మీద 4 గంటల ప్రయాణంలో ఈ భోజనాలు పూర్తిగా అయిపోయాయి. అయితే, ఈ విమానంపై వచ్చిన మొదటి నివేదికలలో కొన్ని వివరాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ముఖ్యంగా, 300 మంది ప్రయాణికుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక యూజర్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. ఈ విమానం, ఎయిర్బస్ లేదా బోయింగ్ 737 అని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఈ ఫ్లైట్ లో 300 మందిని తీసుకెళ్లలేరు. గరిష్ఠ సామర్థ్యం సుమారు 176 మంది మాత్రమే. ఆ సంఖ్యకు సరిపోల్చితే, ప్రతి ప్రయాణికుడికి సగటున 85 మిల్లీలీటర్ల మద్యం పడిందని తెలిపాడు.
Also Read: OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !
દારૂ અને ખમણનું કોમ્બિનેશન,વાઇરલ થયા સુરતીઓ! ,એર ઈન્ડિયા સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઇટના પહેલા જ દિવસે 98% પેસેન્જર્સ મળ્યા, પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો સ્ટોકજ પતાવી દીધો, 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો 15 લિટર દારૂ પીધો#SURAT #bangkok #AirIndia #gujju pic.twitter.com/bhQH66vjGH
— Kunj Patel (@patelkunj4444) December 21, 2024
ఈ సంఘటన గుజరాత్ నిషేధ విధానంపై కొత్త చర్చలను తెరపైకి తీసుకువచ్చింది. ఒక సామాజిక మాధ్యమ యూజర్ వ్యాఖ్యానిస్తూ, ఇది గుజరాత్ ప్రజలు మద్యం వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం చేస్తోందని, నిషేధాన్ని మరోసారి ఆలోచించాలని అంటున్నారు. నియంత్రిత మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పొందడాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమని కామెంట్ చేస్తున్నారు. నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని చూడగలుగుతున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?