Air India Express: మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు.. నాలుగు గంటల్లో 15 లీటర్ల మందు తాగేసిన ప్రయాణికులు
- సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రారంభం
- నాలుగు గంటల్లో 15 లీటర్ల మందు తాగేసిన ప్రయాణికులు
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express: గుజరాత్లోని సూరత్ నుంచి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మొదటి విమానాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ పూర్తిగా బుక్ అయిన ఫ్లైట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ప్రయాణికులు తమ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకోవడంతో ఈ ప్రయాణం మరింత వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ ప్రయాణంలో ప్రయాణికులు అధిక మద్యం వినియోగించడమే ఇందుకు కారణం. విమానంలో ప్రయాణికులు దాదాపు 15 లీటర్ల ప్రీమియమ్ మద్యం, అందులో చివాస్ రిగల్, బకార్డీ, బీర్ వంటి పానీయాలను కలిపి దాదాపు రూ. 1.8 లక్షల విలువైన మద్యం వినియోగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రయాణికుల మద్యం వినియోగం ఎక్కువగా ఉండటంతో బ్యాంకాక్కు చేరుకునే ముందునే మద్యం అయిపోయిందని విమాన సిబ్బంది ప్రకటించాల్సి వచ్చింది.
Also Read: MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..
Also Read
- T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
- Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
- Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- T20 World Cup: 'కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి'.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
ఈ ప్రయాణంలో ప్రయాణికుల కోసం తీసుకుని వచ్చిన గుజరాతీ వంటకాలు ముఖ్యంగా థెప్లా, ఖమన్ వంటి ఐటెంలు, అలాగే పిజ్జా వంటి ఇతర భోజనాలు అందరినీ ఆకర్షించాయి. ఇవి విమానంలో అందించిన ఫుడ్, డ్రింక్స్కు చక్కటి కాంబినేషన్ గా నిలిచాయి. మొత్తం మీద 4 గంటల ప్రయాణంలో ఈ భోజనాలు పూర్తిగా అయిపోయాయి. అయితే, ఈ విమానంపై వచ్చిన మొదటి నివేదికలలో కొన్ని వివరాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ముఖ్యంగా, 300 మంది ప్రయాణికుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక యూజర్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. ఈ విమానం, ఎయిర్బస్ లేదా బోయింగ్ 737 అని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఈ ఫ్లైట్ లో 300 మందిని తీసుకెళ్లలేరు. గరిష్ఠ సామర్థ్యం సుమారు 176 మంది మాత్రమే. ఆ సంఖ్యకు సరిపోల్చితే, ప్రతి ప్రయాణికుడికి సగటున 85 మిల్లీలీటర్ల మద్యం పడిందని తెలిపాడు.
Also Read: OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !
દારૂ અને ખમણનું કોમ્બિનેશન,વાઇરલ થયા સુરતીઓ! ,એર ઈન્ડિયા સુરતથી બેંગકોકની પહેલી ફ્લાઇટના પહેલા જ દિવસે 98% પેસેન્જર્સ મળ્યા, પેસેન્જરોએ વિસ્કી અને બીયરનો સ્ટોકજ પતાવી દીધો, 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો 15 લિટર દારૂ પીધો#SURAT #bangkok #AirIndia #gujju pic.twitter.com/bhQH66vjGH
— Kunj Patel (@patelkunj4444) December 21, 2024
ఈ సంఘటన గుజరాత్ నిషేధ విధానంపై కొత్త చర్చలను తెరపైకి తీసుకువచ్చింది. ఒక సామాజిక మాధ్యమ యూజర్ వ్యాఖ్యానిస్తూ, ఇది గుజరాత్ ప్రజలు మద్యం వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం చేస్తోందని, నిషేధాన్ని మరోసారి ఆలోచించాలని అంటున్నారు. నియంత్రిత మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పొందడాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరమని కామెంట్ చేస్తున్నారు. నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని చూడగలుగుతున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Buchi Babu: ‘ఈ జన్మకి ఇది చాలురా’.. స్టేజ్పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు!
-
T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
-
Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
-
TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?