Bihar Elections 2025: బీహార్లో ఒవైసీ కొత్త ఫ్రంట్.. AIMIM పార్టీ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. బుధవారం కిషన్గంజ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మత శక్తులను అరికట్టడానికి ఆజాద్ సమాజ్ పార్టీ, స్వామి ప్రసాద్ మౌర్య సొంత పార్టీ అయిన రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ కలిసి పొత్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
READ MORE: Bihar Elections: 16 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఆర్జేడీతో కలిసి పోటీ లేనట్లే!
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
బీహార్లో AIMIM 35 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని అఖ్తరుల్ ఇమాన్ పేర్కొన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ 25 స్థానాల్లో, రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో బలంగా పోటీదారుగా నిలిచి కొత్త ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయని ఇమాన్ అభిప్రాయపడ్డారు. తమ పోరాటం అధికారం కోసం కాదని.. దేశంలో న్యాయాన్ని స్థాపించడమే తమ ధ్యేయమన్నారు. అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశామని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ ఆవిర్భవించింది. సీమాంచల్ ప్రాంతంలో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి ఒవైసీ పార్టీ ఇప్పటికే కృషి చేస్తోంది. కిషన్గంజ్, కతిహార్, అరారియా వంటి జిల్లాల్లో AIMIM ప్రభావం ఇప్పటికే కనిపించింది. మరోవైపు.. పొత్తు ప్రకటించక ముందు.. అసదుద్దీన్ ఒవైసీ ఆర్జేడీ నాయకత్వంపై దాడి చేశారు.
READ MORE: డ్యూయల్ టోన్ ఫినిషింగ్, టచ్ కంట్రోల్లతో Honor Earbuds 4 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?