AIADMK: బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న ఏఐఏడీఎంకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK: అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే బీజేపీతో పొత్తును తెంచుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం సీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి.1956లో మధురైలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నాదురై హిందూ మతాన్ని అవమానించారని ఆరోపించిన తర్వాత అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అన్నాదురైని మధురైలో దాచి ఉంచారని, క్షమాపణలు చెప్పడంతో ఆయన తప్పించుకున్నారని కూడా బీజేపీ నేత ఆరోపించారు.
Also Read: Nitish Kumar: ఎన్డీయేలో జేడీయూ చేరికపై నితీష్ కుమార్ ఏమన్నారంటే?
Also Read
బీజేపీ ఎలాంటి పొత్తు లేదని, ఎన్నికల సమయంలోనే ఎన్నికల పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని ద్రవిడ పార్టీ సీనియర్ నేత డి.జయకుమార్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రిని అవమానిస్తే తమ పార్టీ కార్యకర్తలు సహించరని అన్నారు. గతంలో డి జయకుమార్ మాట్లాడుతూ.. “అన్నామలై ఏఐఏడీఎంకేతో పొత్తు కోరుకోవడం లేదు. బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ.. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా.. మేం మిమ్మల్ని ఎందుకు మోయాలి.. బీజేపీ ఇక్కడ అడుగు పెట్టదు.. మీ ఓటు బ్యాంకు తెలుసు.” అని మాజీ మంత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, దాని రాష్ట్ర శాఖ అధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..