Onion: కిలో ఉల్లి రూ.25కే.. రేపట్నుంచే విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion: పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఉల్లి బఫర్ స్టాక్ను 300,000 మెట్రిక్ టన్నుల నుండి 500,000 మెట్రిక్ టన్నులకు పెంచినందున, ఉల్లి బఫర్ స్టాక్ను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య-ఎన్సీసీఎఫ్) ద్వారా సోమవారం నుంచి కిలోకు రూ. 25 చొప్పున సబ్సిడీపై విక్రయించనున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపింది. అక్టోబర్లో కొత్త పంట వచ్చే వరకు ఉల్లి ధరలను అదుపులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Arvind Kejriwal: మామ మోసం చేశాడు, ఈ చాచాను నమ్మండి.. కేజ్రీవాల్ హామీల వర్షం
Also Read
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
అధికారిక ప్రకటన ప్రకారం, ప్రభుత్వ బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలు సోమవారం నుంచి ఎన్సీసీఎఫ్ అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా రిటైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచబడతాయి. సరఫరా తక్కువగా ఉన్న సమయంలో ధరలు ఊహించని విధంగా పెరిగినట్లయితే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి (PSF)లో 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లను చేర్చడం ద్వారా ఉల్లిపాయల రీటైల్ విక్రయం రాబోయే రోజుల్లో తగిన విధంగా మెరుగుపడుతుందని ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉండగా ఎన్సీసీఎఫ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) రెండింటినీ అదనంగా 100,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆదేశించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఉల్లిపాయల ధర స్వల్పంగా పెరగడం ప్రారంభించింది. ఆగస్ట్ 10 నాటికి ఆల్-ఇండియా రిటైల్ ధర కిలోగ్రాముకు రూ. 27.90గా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కిలోగ్రాముకు కేవలం రూ. 2 పెరిగింది.దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం శనివారం డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల టమాటా ధరలు ఆకాశన్నంటిన సమయంలో కూడా కేంద్రం సబ్సిడీలో విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే ఇప్పుడు ఉల్లి విక్రయాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క