Onion: కిలో ఉల్లి రూ.25కే.. రేపట్నుంచే విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion: పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఉల్లి బఫర్ స్టాక్ను 300,000 మెట్రిక్ టన్నుల నుండి 500,000 మెట్రిక్ టన్నులకు పెంచినందున, ఉల్లి బఫర్ స్టాక్ను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య-ఎన్సీసీఎఫ్) ద్వారా సోమవారం నుంచి కిలోకు రూ. 25 చొప్పున సబ్సిడీపై విక్రయించనున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపింది. అక్టోబర్లో కొత్త పంట వచ్చే వరకు ఉల్లి ధరలను అదుపులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Arvind Kejriwal: మామ మోసం చేశాడు, ఈ చాచాను నమ్మండి.. కేజ్రీవాల్ హామీల వర్షం
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
అధికారిక ప్రకటన ప్రకారం, ప్రభుత్వ బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలు సోమవారం నుంచి ఎన్సీసీఎఫ్ అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా రిటైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచబడతాయి. సరఫరా తక్కువగా ఉన్న సమయంలో ధరలు ఊహించని విధంగా పెరిగినట్లయితే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి (PSF)లో 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లను చేర్చడం ద్వారా ఉల్లిపాయల రీటైల్ విక్రయం రాబోయే రోజుల్లో తగిన విధంగా మెరుగుపడుతుందని ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉండగా ఎన్సీసీఎఫ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) రెండింటినీ అదనంగా 100,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆదేశించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఉల్లిపాయల ధర స్వల్పంగా పెరగడం ప్రారంభించింది. ఆగస్ట్ 10 నాటికి ఆల్-ఇండియా రిటైల్ ధర కిలోగ్రాముకు రూ. 27.90గా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కిలోగ్రాముకు కేవలం రూ. 2 పెరిగింది.దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం శనివారం డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల టమాటా ధరలు ఆకాశన్నంటిన సమయంలో కూడా కేంద్రం సబ్సిడీలో విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే ఇప్పుడు ఉల్లి విక్రయాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!