Onion: కిలో ఉల్లి రూ.25కే.. రేపట్నుంచే విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion: పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఉల్లి బఫర్ స్టాక్ను 300,000 మెట్రిక్ టన్నుల నుండి 500,000 మెట్రిక్ టన్నులకు పెంచినందున, ఉల్లి బఫర్ స్టాక్ను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య-ఎన్సీసీఎఫ్) ద్వారా సోమవారం నుంచి కిలోకు రూ. 25 చొప్పున సబ్సిడీపై విక్రయించనున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపింది. అక్టోబర్లో కొత్త పంట వచ్చే వరకు ఉల్లి ధరలను అదుపులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Arvind Kejriwal: మామ మోసం చేశాడు, ఈ చాచాను నమ్మండి.. కేజ్రీవాల్ హామీల వర్షం
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అధికారిక ప్రకటన ప్రకారం, ప్రభుత్వ బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలు సోమవారం నుంచి ఎన్సీసీఎఫ్ అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా రిటైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచబడతాయి. సరఫరా తక్కువగా ఉన్న సమయంలో ధరలు ఊహించని విధంగా పెరిగినట్లయితే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి (PSF)లో 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లను చేర్చడం ద్వారా ఉల్లిపాయల రీటైల్ విక్రయం రాబోయే రోజుల్లో తగిన విధంగా మెరుగుపడుతుందని ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉండగా ఎన్సీసీఎఫ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) రెండింటినీ అదనంగా 100,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆదేశించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఉల్లిపాయల ధర స్వల్పంగా పెరగడం ప్రారంభించింది. ఆగస్ట్ 10 నాటికి ఆల్-ఇండియా రిటైల్ ధర కిలోగ్రాముకు రూ. 27.90గా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కిలోగ్రాముకు కేవలం రూ. 2 పెరిగింది.దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం శనివారం డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల టమాటా ధరలు ఆకాశన్నంటిన సమయంలో కూడా కేంద్రం సబ్సిడీలో విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే ఇప్పుడు ఉల్లి విక్రయాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!