Bangladesh Violence : బంగ్లాదేశ్ హింసాకాండ.. పౌరులను హెచ్చరించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence : పొరుగు దేశంలో జరుగుతున్న తాజా హింసాత్మక సంఘటనల దృష్ట్యా బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు రావొద్దని భారతదేశం ఆదివారం రాత్రి సూచించింది. అలాగే ఇక్కడ ఉన్న వారు కూడా తదుపరి ఆదేశాల వరకు బంగ్లాదేశ్కు వెళ్లవద్దని భారత్ తన పౌరులను కోరుతూ కొత్త సలహాను జారీ చేసింది. ఆదివారం బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 14 మంది పోలీసులతో సహా దాదాపు 100 మంది మరణించారని ఢాకా నుండి వచ్చిన నివేదికలు తెలిపాయి.
ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్
ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బంగ్లాదేశ్కు వెళ్లవద్దని భారతీయ పౌరులు ఖచ్చితంగా సూచిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాలో పేర్కొంది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు బయట తిరగొద్దని ఢాకాలోని భారత హైకమిషన్తో ఎల్లప్పుడూ టచ్లో ఉండాలని సూచించారు.
Also Read
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
ఇప్పటి వరకు 100 మంది మృతి
ఆదివారం బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అధికార అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో 14 మంది పోలీసులతో సహా 100 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ కారణంగా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, దేశవ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై దుమారం
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యవస్థపై తలెత్తిన గందరగోళంపై ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సహాయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరసనకారులు వచ్చారు. అవామీ లీగ్, ఛత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు వారిని వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమంపై దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణలు, కాల్పులు, ఎదురుదాడుల్లో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదైనా సాయం కోసం బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషన్ అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలి.
ఢాకా లోని భారత హైకమిషన్ ఫోన్ నంబర్లు
+8801958383679
+8801958383680
+8801937400591
తాజావార్తలు
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!