NTV Telugu Site icon

Delhi : అప్పుడు మార్షల్స్ ను పెట్టించి అసెంబ్లీ నుంచి వెళ్లగొట్టారు.. కట్ చేస్తే ప్రస్తుతం కాబోయే స్పీకర్

New Project 2025 02 20t163204.903

New Project 2025 02 20t163204.903

Delhi : 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించగా, అసెంబ్లీ స్పీకర్ పదవికి విజేంద్ర గుప్తా పేరును ఖరారు చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు విజేంద్ర గుప్తాను సభ నుండి బహిష్కరించారు. ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మార్షల్స్ అతడిని భుజాలపై మోసుకుని సభ నుండి బయటకు తీసుకెళ్లారు.

Read Also:KIA: అకస్మాత్తుగా 1,380 కార్లను రీకాల్ చేసిన కియా.. ఏమైందో తెలుసా?

విజేంద్ర గుప్తాను ఇలా ఒకసారి కాదు.. చాలాసార్లు సభ నుండి బయటకు పంపించారు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ వేవ్ లో ఢిల్లీలో బిజెపికి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కూడా బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఏ ప్రయత్నం కూడా చేయలేదు. విజేంద్ర గుప్తా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఆయన సమస్యలను లేవనెత్తేవారు. 2017లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయేందర్ గుప్తా భూ కుంభకోణానికి సంబంధించిన పత్రాలతో వచ్చి సభలో దానిపై చర్చకు డిమాండ్ చేశారు. కానీ అసెంబ్లీ స్పీకర్ దానికి అనుమతించలేదు. బిజెపి వాయిదా తీర్మానం కూడా తిరస్కరించబడింది. దీని తరువాత కూడా బిజెపి గందరగోళం కొనసాగినప్పుడు, స్పీకర్ మొదట విజేంద్ర గుప్తా మైక్‌ను స్విచ్ ఆఫ్ చేసి, మౌనంగా ఉండమని హెచ్చరించారు. అతను అంగీకరించకపోవడంతో మార్షల్ బయటకు తోసేశారు.

Read Also:Deputy CM Pawan Kalyan: కూటమి ప్రభుత్వంపై పవన్‌ కీలక వ్యాఖ్యలు.. అందుకే కొన్ని సమావేశాలు హాజరుకాలేదు..!

ఢిల్లీలో బిజెపికి కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్న సమయంలో కూడా విజయేందర్ గుప్తా తన స్థానాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించాడు. విజయేంద్ర గుప్తా సీటు వాటిలో ఒకటి. ఆయన 2015, 2020, 2025 సంవత్సరాల్లో రోహిణి నుండి కంటిన్యూగా ఎన్నికయ్యారు. 2020లో కూడా విజేంద్ర గుప్తా రోహిణి సీటును 12 వేలకు పైగా ఓట్లతో గెలుచుకున్నారు. 2015 నుండి ప్రతిపక్షంలో కూర్చొని ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నిరంతరం తన గళాన్ని వినిపిస్తున్న విజేందర్ గుప్తా ఇప్పుడు స్పీకర్ కుర్చీపై కూర్చోనున్నారు. ఇప్పుడు ఆయన ఏ కుర్చీ నుంచి సభ నుంచి బయటకు పంపించారో అదే కుర్చీలో కూర్చుంటారు. తన పేరు ఖరారు అయిన తర్వాత విజేంద్ర గుప్తా ముందుగా సభలో CAG నివేదికను ప్రవేశపెడతామని చెప్పారు. దీనిని గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది.