Drunk : కిక్కుకోసం ప్రాణాలతో చెలగాటం.. నిర్మల్లో కల్తీ కల్లు ముఠా బస్ట్
- కల్తీ కల్లు కిక్క్ కోసం ఆల్ఫాజోలం, క్లోరో హైడ్రేట్ కలిపిన ముఠా బస్ట్
- నిర్మల్ జిల్లాలో 425 కేజీల నషా పదార్థాలు పట్టుబాటు
- కల్లు బట్టీలకు సరఫరా.. ఆరోగ్యంపై భారీ ముప్పు, నిపుణుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిక్కుకోసం జనం జీవితాలతో ఆడుకుంటున్నారు కొంత మంది కేటుగాళ్లు. కల్తీ కల్లు తయారు చేస్తూ జనాల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అాలాంటి ముఠాకు నిర్మల్ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆల్పాజోలం, క్లోరో హైడ్రేట్ లాంటి మత్తు పదార్థాలను భారీ ఎత్తున పట్టుకున్నారు. బీరు.. బ్రాందీ.. విస్కీ.. వోడ్కా.. ఇలాంటి ఆల్కహాల్ తాగడం కంటే చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైన కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతుంటారు. కానీ ఆరోగ్యం మాట దేవుడెరుగు.. అసలు ఇప్పుడు దొరికే కల్లు తాగడం వల్ల ప్రాణాలే పోతాయనే విషయం అర్ధమవుతోంది. ఎక్కడ పడితే అక్కడ కల్తీ కల్లు సరఫరా కావడమే ఇందుకు కారణం…
ఓ వైపు చెట్ల నుంచి కల్లు గీయడం తక్కువైపోయింది. మరోవైపు లిక్కర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో కల్తీ కల్లు రాజ్యమేలుతోంది. కొంత మంది దీన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అసలు కల్లు రాకపోవడంతో కల్తీ చేసి మరీ డ్రమ్ముల కొద్దీ కల్లు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ దందా ఎక్కువగా సాగుతోంది…
Also Read
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
కోటగిరి రాజన్న, ఎల్లందుల శ్రీనివాస్. కొన్నిచోట్ల మామూళ్లతో నోళ్లు మూయించి తమ అక్రమ దందా సాగిస్తున్నారు వ్యాపారులు. ఐతే తాజాగా నిర్మల్ జిల్లాలో 425 కేజీల క్లోరోహైడ్రేట్, కేజీ ఆల్ఫా జోలం సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. రెండు కార్లలో వాటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో బుర్ర రమేష్ గౌడ్, బాసుపల్లి రామ గౌడ్, బుర్ర రాజశేఖర్, కోటగిరి రాజన్న, ఎల్లందుల శ్రీనివాస్ ఉన్నారు. వారి పై కేసు నమోదు రిమాండ్కి తరలించారు పోలీసులు… మహరాష్ట్రలో ఇక్కడి ప్రాంతానికి చెందిన వారు అక్కడి యూనిట్లో తయారు చేసి ఇక్కడికి సరఫరా చేస్తున్నారని గుర్తించారు. నిర్మల్, జగిత్యాలతోపాటు ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారని పోలీసులు వెల్లడించారు. కల్లు బట్టీల నిర్వాహకులకు ఇది సరఫరా అవుతుందని తెలిపారు. ఆల్ఫాజోలం, క్లోరో హైడ్రెట్ కలిపిన కల్లు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు..
తాజావార్తలు
-
Xiaomi FX Mini LED Series: అమెజాన్ ఫైర్ టీవీ ఇంటిగ్రేషన్తో.. షియోమి FX మినీ LED సిరీస్ విడుదలకు సిద్ధం
-
Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
-
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?