టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ లీడ్ లో రూపొందిన తాజా చిత్రం బైకర్. బైక్ రేసింగ్ నేపథ్యంతో యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు మంచి హైప్ సాధించినప్పటికీ,స్టేబుల్ రన్ తో కొనసాగుతోంది. కలెక్షన్ లు కూడా పర్వాలేదు. అయితే ఈ మూవి సక్సేస్ తో వరుస ఇంటర్వ్యూలో పాల్గోంటున్న శర్వ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
Also Read :Peddi- Lenin:రామ్ చరణ్ వర్సెస్ అఖిల్.. ‘పెద్ది’ భయంతో ‘లెనిన్’ వెనక్కి!
‘జాను’ సినిమా కోసం థాయ్లాండ్లో స్కైడైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో జరిగిన ప్రమాదం గురించి ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.. ‘నాకు జాను టైమ్లో జరిగిన యాక్సిడెంట్ చాలా పెద్దది. ఆ ప్రమాదం వల్ల నా భుజం ఎముక పూర్తిగా విరిగిపోయింది, అది చాలా క్లిష్టమైన సర్జరీ. కానీ, ఆ సమయంలో ఆ యాక్సిడెంట్ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ఏదో చిన్న దెబ్బ తగిలింది అన్నట్టుగా చూశారు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. నేను అంత తక్కువ వాడినా? నా కష్టానికి విలువ లేదా? అనిపించింది’ అంటూ శర్వానంద్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేసినప్పుడు, పరిశ్రమ నుండి ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదా సానుభూతి లభించకపోవడం తనను ఎంతగానో కుంగదీసిందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ ప్రమాదం తర్వాత శర్వానంద్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. శర్వా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి, దీంతో అభిమానులు ఆయనకు అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.