Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే వాళ్ల కళ్లుగప్పి మాయమైపోయాడు. ఈ సమాచారాన్ని జవాన్లు జైలు యాజమాన్యానికి తెలిపారు. దీంతోపాటు జీఆర్పీలోనూ ఫిర్యాదు చేశారు. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం జీఆర్పీ బృందం గాలిస్తోంది.
Read Also: Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
Also Read
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా పరిధిలోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ దఘోరా నివాసి సునీల్ కుమార్ సాహు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతకుముందు ఆయన రాయ్పూర్ జైలులో ఉన్నారు. అనంతరం దుర్గ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత బిలాస్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై దుర్గ్ కోర్టులో కేసు నడుస్తోంది. బుధవారం పోలీస్ లైన్ హెడ్ కానిస్టేబుల్ దేవచరణ్ మరావి, కానిస్టేబుల్ వికాస్ కుర్రే అతన్ని కోర్టులో హాజరుపరిచి దుర్గ్కు వెళ్లారు. తరువాత, ఇద్దరూ శివనాథ్ ఎక్స్ప్రెస్లో అతన్ని తీసుకొని బిలాస్పూర్కు తిరిగి వస్తున్నారు.
Read Also : Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
రాయ్పూర్లోని సిలియారీ స్టేషన్ సమీపంలో, ఖైదీ టాయిలెట్కు వెళ్లాలని పోలీసులను కోరాడు. వెంటనే సైనికులు అతడిని రైలులోని బాత్రూమ్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గేటు దగ్గర ఉన్న బేసిన్లో ముఖం కడుక్కుంటానన్నాడు. స్టేషన్ సమీపంలో రైలు స్లో అవ్వడంతో వెంటనే రైలు నుంచి దూకాడు. రైలు నుంచి నిందితుడు దూకగానే జవాన్ల చేతులు, కాళ్లు ఆడలేదు. తేరుకుని జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే అతను జవాన్ల కళ్లనుంచి అదృశ్యమయ్యాడు. దీంతో సైనికులు ఆర్పీఎఫ్కు సమాచారం అందించారు. నిందితుడు కనిపించకపోవడంతో జవాన్లు జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. దీనిపై జీఆర్పీ పరారీలో ఉన్న ఖైదీ కోసం వెతుకుతోంది.
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..