Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే వాళ్ల కళ్లుగప్పి మాయమైపోయాడు. ఈ సమాచారాన్ని జవాన్లు జైలు యాజమాన్యానికి తెలిపారు. దీంతోపాటు జీఆర్పీలోనూ ఫిర్యాదు చేశారు. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం జీఆర్పీ బృందం గాలిస్తోంది.
Read Also: Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా పరిధిలోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ దఘోరా నివాసి సునీల్ కుమార్ సాహు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతకుముందు ఆయన రాయ్పూర్ జైలులో ఉన్నారు. అనంతరం దుర్గ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత బిలాస్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై దుర్గ్ కోర్టులో కేసు నడుస్తోంది. బుధవారం పోలీస్ లైన్ హెడ్ కానిస్టేబుల్ దేవచరణ్ మరావి, కానిస్టేబుల్ వికాస్ కుర్రే అతన్ని కోర్టులో హాజరుపరిచి దుర్గ్కు వెళ్లారు. తరువాత, ఇద్దరూ శివనాథ్ ఎక్స్ప్రెస్లో అతన్ని తీసుకొని బిలాస్పూర్కు తిరిగి వస్తున్నారు.
Read Also : Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
రాయ్పూర్లోని సిలియారీ స్టేషన్ సమీపంలో, ఖైదీ టాయిలెట్కు వెళ్లాలని పోలీసులను కోరాడు. వెంటనే సైనికులు అతడిని రైలులోని బాత్రూమ్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గేటు దగ్గర ఉన్న బేసిన్లో ముఖం కడుక్కుంటానన్నాడు. స్టేషన్ సమీపంలో రైలు స్లో అవ్వడంతో వెంటనే రైలు నుంచి దూకాడు. రైలు నుంచి నిందితుడు దూకగానే జవాన్ల చేతులు, కాళ్లు ఆడలేదు. తేరుకుని జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే అతను జవాన్ల కళ్లనుంచి అదృశ్యమయ్యాడు. దీంతో సైనికులు ఆర్పీఎఫ్కు సమాచారం అందించారు. నిందితుడు కనిపించకపోవడంతో జవాన్లు జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. దీనిపై జీఆర్పీ పరారీలో ఉన్న ఖైదీ కోసం వెతుకుతోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!