Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే వాళ్ల కళ్లుగప్పి మాయమైపోయాడు. ఈ సమాచారాన్ని జవాన్లు జైలు యాజమాన్యానికి తెలిపారు. దీంతోపాటు జీఆర్పీలోనూ ఫిర్యాదు చేశారు. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం జీఆర్పీ బృందం గాలిస్తోంది.
Read Also: Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా పరిధిలోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ దఘోరా నివాసి సునీల్ కుమార్ సాహు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతకుముందు ఆయన రాయ్పూర్ జైలులో ఉన్నారు. అనంతరం దుర్గ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత బిలాస్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై దుర్గ్ కోర్టులో కేసు నడుస్తోంది. బుధవారం పోలీస్ లైన్ హెడ్ కానిస్టేబుల్ దేవచరణ్ మరావి, కానిస్టేబుల్ వికాస్ కుర్రే అతన్ని కోర్టులో హాజరుపరిచి దుర్గ్కు వెళ్లారు. తరువాత, ఇద్దరూ శివనాథ్ ఎక్స్ప్రెస్లో అతన్ని తీసుకొని బిలాస్పూర్కు తిరిగి వస్తున్నారు.
Read Also : Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
రాయ్పూర్లోని సిలియారీ స్టేషన్ సమీపంలో, ఖైదీ టాయిలెట్కు వెళ్లాలని పోలీసులను కోరాడు. వెంటనే సైనికులు అతడిని రైలులోని బాత్రూమ్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గేటు దగ్గర ఉన్న బేసిన్లో ముఖం కడుక్కుంటానన్నాడు. స్టేషన్ సమీపంలో రైలు స్లో అవ్వడంతో వెంటనే రైలు నుంచి దూకాడు. రైలు నుంచి నిందితుడు దూకగానే జవాన్ల చేతులు, కాళ్లు ఆడలేదు. తేరుకుని జవాన్లు చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే అతను జవాన్ల కళ్లనుంచి అదృశ్యమయ్యాడు. దీంతో సైనికులు ఆర్పీఎఫ్కు సమాచారం అందించారు. నిందితుడు కనిపించకపోవడంతో జవాన్లు జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. దీనిపై జీఆర్పీ పరారీలో ఉన్న ఖైదీ కోసం వెతుకుతోంది.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!