Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Cut His wife Into Pieces : తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను రెండు ముక్కలు చేసి కాల్వలో పడేశాడో కీచక భర్త. ఈ సంఘటన సిలిగురి సబ్ డివిజన్లోని ఫన్సీదేవస్ గోవల్తులి మలుపు వద్ద జరిగింది. మృతురాలి పేరు రేణుకా ఖాతున్.. వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త మహ్మద్ అన్సారుల్ తన భార్యను హత్య చేశాడు. అనంతరం రేణుక మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికేశాడు. ముక్కలను తీసుకెళ్లి తీస్తా కెనాల్లో పడేశాడు. గురువారం ఉదయం నుంచి తీస్తా కెనాల్లో రేణుక మృతదేహం కోసం పోలీసు బృందాలు గాలించాయి.
Read Also: Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?
Also Read
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుక సిలిగురి ప్రాంతంలోని ఓ కళాశాలలో బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. డిసెంబర్ చివరి వారం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. రేణుక కుటుంబ సభ్యులు డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్సారుల్ ను విచారించగా సంచలన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ 24న అన్సరుల్ తన భార్యను హత్య చేసినట్లు దర్యాప్తులో ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి పక్కనే ఉన్న తీస్తా కెనాల్లో పడేశానని చెప్పాడు.
Read Also: Prince Harry : మా అన్న నన్ను పడేసి తన్నాడు.. అందుకే నడుం నొప్పి వచ్చింది
మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకకు అన్సరుల్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. సిలిగురిలోని వార్డు నంబర్ 43లోని దాదాభాయ్ కాలనీలో నివాసం ఉండేవాడు. ఈ జంటకు మొదట్లో కొన్ని విభేదాలున్నాయని, అయితే ఆ తర్వాత వాటిని పరిష్కరించుకున్నారని రేణుక కుటుంబం పేర్కొంది. అప్పటి నుంచి అంతా బాగానే ఉంది.
Read Also: Viral : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోన్న ఆరేళ్ల క్యాన్సర్ చిన్నారి కథనం
ఈ ఘటనకు సంబంధించి సిలిగురి పోలీస్ కమిషనర్ అఖిలేష్ చతుర్వేది మాట్లాడుతూ, డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఖాతున్ను హత్య చేసినట్లు అన్సరుల్ అంగీకరించాడని… మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి తీస్తా కాలువలో పడేశారని తెలిపాడు. అరెస్టు చేసిన అన్సరుల్ను గురువారం సిలిగురి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన సమాచారం తెలియడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!