Telangana University : తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ సోదాలు

Acb Raids

Acb Raids

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా కాలేజీకి పరీక్ష హాలు కేటాయించేందుకు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీసీ డిమాండ్‌పై ఫిర్యాదుదారు దాసరి శంకర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.నిజామాబాద్‌కు చెందిన శంకర్‌ భీమ్‌గల్‌లోని తన కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వీసీని సంప్రదించగా, వీసీ అనుమతులు ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఇటీవల ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సోదాలు నిర్వహించాయి.

Also Read : Hair Fall Tips: పెరుగుతో రోజూ ఇలా చేస్తే.. మీ జుట్టు రాలడం వారంలో తగ్గిపోతుంది! ట్రై చేసి చూడండి

అనుచిత నియామకాలు, లావాదేవీలు జరిగాయని గుర్తించిన బృందాలు వీసీ ఇంటిపై దాడికి స్కెచ్‌ వేసి శనివారం ఉదయం తార్నాకలోని ఆయన ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడు శనివారం ఉదయం వీసీని కలవడానికి వెళ్లి లంచం డబ్బును అందజేయగా, ఏసీబీ బృందాలు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. యూనివర్శిటీ ప్రాంగణాల్లోనూ దాడులు చేస్తున్నారు. నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనేది ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read : Pesticides: తల్లి పాల ద్వారా పిల్లలకు చేరుతున్న పురుగుమందులు.. మాంసం తింటే రిస్క్ ఎక్కువట!