Electric shock: వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నగరంలో విషాదం నింపింది. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్చారి (28) బస్సు బాడీ కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి వినాయక మండపానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. మండపం పై నుంచి వర్షం నీరు కిందకు రాకుండా టార్పాలిన్ తో కడుగడం మొదలుపెట్టాడు.
Read also: Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..
ఒక చేత్తో ఐరన్ బైండింగ్ వైర్ పట్టుకుని మరో చేత్తో మండపం పైకి విసిరాడు. బైండింగ్ వైరు విద్యుత్ తీగలకు తగలడంతో నవీన్చారి షాక్తో కింద పడిపోయాడు. అక్కడే ఉన్న వడ్ల శంకర్ చారి(40) కర్ర సహాయంతో నవీన్ చారిని పక్కకు తరలించే ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ తగిలింది. దీంతో శంకర్ చారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే శంకర్ చారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవీన్ చారి మృతి చెందాడు. పండుగరోజే ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Terrible incident: పందులు దొంగతనం చేస్తుండగా చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన వ్యక్తి..