Uttar Pradesh: మంత్రాల అనుమానంతో మహిళపై దాడి.. నోట్లో మూత్రం పోసి..!
- మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై దాడి
- ఉత్తర ప్రదేశ్లోని సూరజ్పూర్ ఖేడీ గ్రామంలో ఘటన
- తమ కూతురుకు చేతబడి చేస్తుందని అనుమానం మహిళను తీవ్రంగా కొట్టి.. జుట్టు కత్తిరించి.. నోట్లో మూత్రం పోసిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై క్రూరత్వం చూపించారు. కనికరం లేకుండా.. దాడి చేశారు. ఈ ఉదంతం ఉత్తర ప్రదేశ్లోని సూరజ్పూర్ ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. తమ కూతురు అనారోగ్యానికి కారణం ఆ మహిళేనని.. తాను చేతబడి చేస్తుందని అనుమానించారు. దీంతో.. బాలిక కుటుంబీకులు ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా జుట్టు కూడా కత్తిరించారు.
అయితే.. అంతటితో ఆగకుండా, తనతో బలవంతంగా మూత్రం తాగించారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా.. బాధితురాలి కుటుంబం బీహార్లోని పూర్నియాలో ఉంటుండగా.. ఈ మహిళ మాత్రం ఆ గ్రామంలో ఇళ్లు అద్దెకు తీసుకుని జీవిస్తుంది.
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు ననువా ఓ కాంట్రాక్టర్.. ఇతను కూడా బీహార్ రాష్ట్రానికి చెందినవాడే. అయితే.. కాంట్రాక్టర్ కుమార్తె తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో.. ఆ మహిళపై అనుమానం వచ్చి.. తానే తన కూతురికి చేతబడి చేస్తుందని అనుమానించాడు. దీంతో.. కోపంతో బాధిత మహిళపై నిందితుడు మొదట దాడి చేసి, అనంతరం ఆమె జుట్టును కత్తిరించారు. అయితే.. ఈ క్రమంలో నిందితుడు తనను బలవంతంగా మూత్రం తాగించారని బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా.. తీవ్ర గాయాలైనట్లు చెప్పింది.
దాడికి సంబంధించి నిందితుడు తమ మొబైల్ ఫోన్లో ఓ వీడియో తీశాడు. కాగా.. ఈ వీడియో అతని దగ్గరి నుంచి సోషల్ మీడియాలో చేరింది. ఈ క్రమంలో.. బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. నిందితుడు ననువా కాంట్రాక్టర్, అతని భార్య పింకీ, మైనర్ కుమారుడు, కుమార్తెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!