Site icon NTV Telugu

Rangareddy: మరో ఘోరం.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

Rape

Rape

తెలంగాణలో మరో ఘోరం చోటు చేసుకుంది. సీఎంఆర్ కాలేజ్ ఘటన మరువకముందే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి జీవితానికి రక్షణ లేకుండా పోయింది. ఓ కామాంధుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం శివారులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరోసారి విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే……

Read Also: Champions Trophy 2025: ఇండియాకు నో ఛాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచేది ఆ జట్టే..?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంజనీర్ కాలేజ్ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై కాలేజ్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున హాస్టల్‌లోకి వెళ్లి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. తెల్లవారుజామున కావడంతో విద్యార్థినులందరూ నిద్రలో ఉన్నారు. ఈ క్రమంలో కామాంధుడు ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటనపై విద్యార్థిని అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Brahmanandam: బ్రహ్మానందానికి శేఖర్ కమ్ముల ఇంత దగ్గరి చుట్టమా?

Exit mobile version