NTV Telugu Site icon

Student Died: ఆర్‌టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి.. (వీడియో)

Accident

Accident

హైదరాబాద్‌లోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని జూన్ 14 శుక్రవారం నాడు బస్సు దిగే ప్రయత్నంలో కదులుతున్న టిజిఎస్‌ ఆర్‌టిసి బస్సు చక్రాల కింద పడి మరణించిన దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీజిఎస్‌ఆర్‌టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో బాధితురాలు మెహ్రీన్‌ అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన అమ్మాయి హైదరాబాద్‌ లోని యూసుఫ్‌గూడ లోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.

Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు

విద్యార్థి బస్సు చక్రాల కింద ఎలా జారి పడిన ఘటనకు సంబంధించిన సిసిఫుటేజీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఆ వీడియో వైరల్ అవుతుంది. చనిపోయిన అమ్మాయిని మెహ్రీన్‌గా పోలీసులు గుర్తించారు. ఆపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

White Hair: జుట్టు తెల్లగా ఎందుకు మారుతుందంటే..