కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. 7వ వేతన సంఘం డిసెంబర్ 31, 2025తో ముగిసిన నేపథ్యంలో, 8వ వేతన సంఘం (8th Pay Commission) కింద జీతాలు, పెన్షన్లు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.0 నుంచి 3.25 వరకు అమలైతే, జీతాలు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
Also Read:Saudi Arabia-Iran-Mecca: రక్తం పారింది… ఇస్లాం పవిత్ర నగరం కోసం ఇరాన్-సౌదీ యుద్ధం..!
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏమిటి?
ఇది ప్రస్తుత బేసిక్ పేను గుణిస్తుంది.
7వ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57.
8వ పే కమిషన్లో ఉద్యోగ సంఘాలు 3.0–3.25 డిమాండ్ చేస్తున్నాయి.
ఇది అమలైతే.. కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి సుమారు రూ.54,000–రూ.58,500 వరకు పెరగవచ్చు.
సగటు జీతం పెంపు 25% నుంచి 35% వరకు (కొన్ని అంచనాల ప్రకారం 30-34%) ఉండవచ్చు.
హెచ్ఆర్ఏ, టీఏ, ఇతర అలవెన్సులు కూడా బేసిక్ పే ఆధారంగా పెరుగుతాయి.
అరియర్స్ (బకాయిలు) వివరాలు..
ఎంత వచ్చే అవకాశం.. కొత్త వేతన నిర్మాణం జనవరి 1, 2026 నుండి రెట్రోస్పెక్టివ్గా (వెనుక తేదీ నుండి) అమలు కావచ్చు.
కమిషన్ సిఫార్సులు మిడ్-2027 లేదా తర్వాత వచ్చే అవకాశం ఉంది.
అందువల్ల 18 నుంచి 24 నెలల (కొన్ని అంచనాల్లో 15–20 నెలలు) అరియర్స్ చెల్లించాల్సి ఉంటుంది.
అరియర్స్ అంచనాలు (20 నెలల ఆధారంగా, బేసిక్ పే రూ.50,000 లోపు ఉన్నవారికి):
Also Read:IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
ఉన్నత స్థాయి ఉద్యోగులు (ఎక్కువ బేసిక్ పే ఉన్నవారు): రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఒకేసారి లంప్సమ్ అరియర్స్ వచ్చే అవకాశం. అరియర్స్ లెక్కలో బేసిక్ పే తేడా + డీఏ (Dearness Allowance) తేడా కలుపుతారు. HRA, TA వంటివి కొన్ని సందర్భాల్లో అదనంగా ఉండవచ్చు. కేబినెట్ ఆమోదం తర్వాత ICRA అంచనా ప్రకారం, FY2028లో జీతాల ఖర్చు 40-50% పెరగవచ్చు (అరియర్స్ కారణంగా). ప్రభుత్వం MyGov ప్లాట్ఫాం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, సంఘాల నుండి సూచనలు స్వీకరించింది.
