Odisha: పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్వే.. 187 పోస్టులకు 8,000 మంది పోటీ
- పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్వే
- 187 పోస్టులకు 8,000 మంది పోటీ
- ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ ఘటన
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. కానీ ఆ రాష్ట్రంలో దీనికి భిన్నంగా ఎయిర్ పోర్ట్ రన్ వే పై పరీక్ష నిర్వహించారు. రన్ వేను పరీక్షా కేంద్రంగా మార్చారు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హోంగార్డ్ నియామక పరీక్ష రాయడానికి వచ్చిన ఎనిమిది వేల మంది అభ్యర్థులను ఎయిర్స్ట్రిప్పై కూర్చోబెట్టాల్సి వచ్చింది.
187 హోమ్ గార్డ్ పోస్టులకు కనీస అర్హత ఐదవ తరగతి ఉత్తీర్ణత. అయినప్పటికీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సహా 8,000 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. తెల్లవారుజాము నుండే, పరీక్ష జరిగిన జమదర్పాలి ఎయిర్స్ట్రిప్ వద్ద పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం అధికారులకు అనేక లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. సాంప్రదాయ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు భావించారు.
Also Read
- Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
పరిస్థితిని అదుపులో ఉంచి పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు, పరీక్ష నిర్వహణ యంత్రాంగం జమదర్పాలి ఎయిర్స్ట్రిప్ను పరీక్షా వేదికగా ఎంచుకుంది. అభ్యర్థులను ఎయిర్స్ట్రిప్లో ఓపెన్ స్కై కింద
కూర్చోబెట్టారు. అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులు అంతటా క్రమశిక్షణను పాటించారు. ఈ పరీక్ష డిసెంబర్ 16న సంబల్పూర్లో జరిగింది. ఈ పరీక్షకు దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్ష రోజున దాదాపు 8,000 మంది హాజరయ్యారని సంబల్పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) తెలిపారు. 8,000 మంది అభ్యర్థులకు ఒకే చోట పరీక్ష నిర్వహించాలంటే ఇరవై పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సంబల్పూర్లో ప్రతి ఆదివారం అనేక పరీక్షలు జరుగుతాయి, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడం కష్టం అవుతుందని అన్నారు. అందుకే ఎయిర్ పోర్ట్ రన్ వేపై పరీక్ష నిర్వహించామని తెలిపారు.
తాజావార్తలు
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?