Bharat Ratna Award : అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’కు 70 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Ratna Award : ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ అవార్డును జనవరి 2, 1954న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ 70ఏళ్లలో ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు, రచయితలు దీనిని అందుకున్నారు. కులం, మతం, తరగతి, రంగు, విద్య మొదలైన వాటికి అతీతంగా ఈ అవార్డును అందజేస్తారు. పద్మ అవార్డులకు భిన్నంగా భారతరత్న అవార్డులను వ్యక్తులు ఎంపిక చేస్తారు. ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తులను సిఫార్సు చేస్తారు. ఈ అవార్డు ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఇవ్వబడుతుంది. అలాగే.. ఏటా ఈ అవార్డు ఇవ్వాలనే నిబంధన లేదు. భారతరత్న అవార్డు పొందిన పౌరులు 7వ స్థాయి గౌరవాన్ని పొందుతారు (మొదటి 6 స్థానాలు… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి).
Read Also:Revanth Reddy: పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో.. రూట్ మార్పుతో తగ్గనున్న వ్యయం
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ఈ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రావి ఆకులను పోలిన సర్టిఫికేట్, పతకాన్ని అందజేస్తారు. దీనిపై ఒక వైపు ప్లాటినంతో చెక్కబడిన సూర్యుని ముద్రను కలిగి ఉంటుంది. కింద హిందీలో భారతరత్న అని రాసి ఉంది. మెడల్ అంచులు కూడా ప్లాటినం లైనింగ్ కలిగి ఉంటాయి. మరోవైపు, అశోక స్తంభం ముద్ర ఉంది. దాని కింద దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంది. ఈ అవార్డు కింద ఎలాంటి నగదు ప్రోత్సాహకం లేదు. వారికి ఉచిత రైల్వే ప్రయాణ సౌకర్యం, జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం, ప్రోటోకాల్ మర్యాద ఉంది. అయితే, వారు తమ పేరు ముందు ‘భారతరత్న’ అని బహిరంగంగా వ్రాసి ప్రదర్శించకూడదు. కానీ.. తమ లెటర్ హెడ్ లోనూ, విజిటింగ్ కార్డ్ లోనూ ఈ అవార్డు వచ్చినట్లు రాసుకోవచ్చు. ఫ్రాంటియర్ గాంధీగా పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా వంటి విదేశీయులతో సహా ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డు లభించింది. అయితే మొరార్జీదేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఈ అవార్డును నిలిపివేసింది. 2013లో తొలిసారిగా క్రీడాకారులకు ఇవ్వాలని నిర్ణయించారు. 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు భారతరత్న అవార్డు లభించింది. 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.
Read Also:Liqour Sales New Record: న్యూ ఇయర్ జోష్.. ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్
సాధారణంగా ఇలాంటి పౌర పురస్కారాల విషయంలో ఏకాభిప్రాయం ఎప్పుడూ సాధ్యం కాదు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ అవార్డుపై విమర్శలు రావడంలో ఆశ్చర్యం లేదు. 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఈ అవార్డు ప్రకటించినా.. కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించకుండా మరణానంతర అవార్డును ప్రకటించడంపై కేంద్రంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దుమారం రేపింది. కాగా, బోస్ కుటుంబ సభ్యులు అవార్డును స్వీకరించేందుకు నిరాకరించడంతో కేంద్రం అవార్డును వెనక్కి తీసుకుంది. 1977లో ఇందిరా ప్రభుత్వం ఈ అవార్డును కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు కామరాజ్ నాడార్కు అందించగా, 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సినీ నటుడు, తమిళనాడు సీఎం అయిన ఎంజీఆర్కు ఈ అవార్డును అందించింది. అలాగే ఈ అవార్డుకు.. పండిట్ రవిశంకర్ పైరవీ చేశారని, దళితుల ఓట్ల కోసం అప్పటి ప్రధాని వీపీ సింగ్.. అంబేద్కర్ కు ఈ అవార్డును ప్రకటించారని వినికిడి. 1946లో మరణించిన మదన్ మోహన్ మాలవ్యకు 2015లో మోడీ ప్రభుత్వం ఈ అవార్డును ఇవ్వడంతో వివాదం తలెత్తింది.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!