నేపాల్లో బుధవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ విమానయాన సంస్థ సౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ విమానంలో మొత్తం 19 మంది ఉండగా.. అందులో 18 మంది మరణించారు. నేపాల్లో జరిగిన విమాన ప్రమాదం ఒక్కటే కాదు.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కనీసం 2694 విమాన ప్రమాదాలు సంభవించాయి. విమాన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ రైసీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సంవత్సరం ఎక్కడ, ఎన్ని విమాన ప్రమాదాలు సంభవించాయో తెలుసుకుందాం.. బుధవారం ఉదయం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా.. సౌర్య ఎయిర్లైన్ కంపెనీకి చెందిన విమానం రన్వేపై నుండి జారిపడి కూలిపోయింది. పోఖారా వెళ్తున్న విమానంలో ఇద్దరు సిబ్బంది.. 17 మంది టెక్నీషియన్లు ఉన్నారు. ఈ వ్యక్తులు మరొక విమానం మరమ్మతు కోసం పోఖారాకు వెళ్తున్నారు. విమానంలో ఉన్న 19 మందిలో 18 మంది మరణించారంటే ప్రమాదం ఎంత భయంకరంగా ఉందో అంచనా వేయవచ్చు. కెప్టెన్ మాత్రమే సజీవంగా బయటపడ్డాడు.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Duplicate Medicines: కోట్ల విలువైన నకిలీ మందులు సీజ్..
US-ఆధారిత ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ యొక్క ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ (ASN) నుండి వచ్చిన డేటా ప్రకారం.. ఈ సంవత్సరం కనీసం 2,694 విమానాలకు సంబంధించిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల కారణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 697 మంది చనిపోయారు. ASN ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు.. భద్రతా సమస్యలపై సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న మలేషియా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు (యూరోకాప్టర్ AS 555SN ఫెన్నెక్ M502-6 మరియు అగస్టావెస్ట్ల్యాండ్ AW139 M503-3) ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనల్లో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 18న.. కెన్యా ఎయిర్ ఫోర్స్ (KAF)కి చెందిన బెల్ UH-1H హ్యూ II విమానం కూలిపోయి 10 మంది మరణించారు. మార్చి 12న రష్యా వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్ Il-76MD RF-76551 విమానం కూలిపోయి 16 మంది మరణించారు. ఫిబ్రవరి 23న రష్యా వైమానిక దళానికి చెందిన బెరీవ్ A-50U RF-50610-42 విమానం కూలి 10 మంది మరణించారు. జనవరి 14న రష్యాకు చెందిన మరో ఎయిర్క్రాఫ్ట్ బెరీవ్ యాన్-50యూ ఆర్ఎఫ్-93966 37ఆర్ కూలిపోయి 11 మంది మరణించారు.
Fact Check: ఆ రెవెన్యూ రికార్డు నకిలీది.. ఏపీ ప్రభుత్వం
గత ఐదేళ్లలో ఎన్ని సంఘటనలు జరిగాయి..?
ASN డేటాబేస్ ప్రకారం.. 2020 సంవత్సరంలో విమానాలకు సంబంధించిన 4374 సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా నమోదు చేయబడ్డాయి. వీటిలో 1395 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 1431 మరణాలు సంభవించగా, సంఘటనల సంఖ్య 4987కి పెరిగింది. 2022లో 5,567 సంఘటనలు నమోదయ్యాయి.. ఫలితంగా 1,561 మంది మరణించారు. గత ఏడాది విమానాలకు సంబంధించి కనీసం 5,312 సంఘటనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 1276 మంది మరణించారు. 2024లో విమానాలకు సంబంధించిన సంఘటనలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఇప్పటివరకు 2696 సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 697 మంది ప్రమాదాల బారిన పడ్డారు. ఈ ఏడాది భారత్లో 36 విమానాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ వాటి వల్ల జరిగిన నష్టం చాలా తక్కువ. ఈ ఏడాది భారత్లో ఈ ఘటనల్లో ఒక్కరు మాత్రమే మరణించారు. ఫిబ్రవరిలో తెలంగాణలోని హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి మరణించారు. కార్పోరల్ ర్యాంక్ ఆఫీసర్ హర్వీర్ చౌదరి U-736 కిరణ్ ఎయిర్క్రాఫ్ట్లో పని చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.