Site icon NTV Telugu

Indian Student: 10ఏళ్లు..విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి..అత్యధికంగా ఇక్కడే..

Indian Students Died Abroad

Indian Students Died Abroad

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం.. గత ఐదేళ్లలో 41 దేశాల్లో కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. కెనడాలో అత్యధికంగా 172 మరణాలు సంభవించాయి. హింసాత్మక దాడుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరణానికి గల కారణాలలో సహజ కారణాలు, ప్రమాదాలు, వైద్య అత్యవసర పరిస్థితులు కూడా ఉన్నాయి. లోక్‌సభ వర్షాకాల సమావేశంలో కేరళ ఎంపీ కొడికున్నిల్‌ సురేష్‌ అడిగిన ప్రశ్నపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ ఈ సమాచారాన్ని అందించారు.

READ MORE: Sunitha Krishnan: బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేసినా నేను నో చెప్పా!

కెనడాలో ఎక్కువ మంది విద్యార్థులు..
కెనడాలో అత్యధికంగా 172 మంది భారతీయ విద్యార్థులు మరణించారని విదేశాంగ మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆ తర్వాత అమెరికాలో 108 మంది విద్యార్థులు చనిపోయారు. బ్రిటన్‌లో 58 మంది, ఆస్ట్రేలియాలో 57 మంది, రష్యాలో 37 మంది, జర్మనీలో 24 మంది విద్యార్థులు మరణించారు. పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఓ విద్యార్థి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, విదేశాల్లో భారతీయ విద్యార్థులపై హింసాత్మక దాడుల గురించి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాచారం ఇచ్చారు. ఇండియన్ మిషన్/పోస్ట్ డేటా ప్రకారం.. ఇటీవల విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులపై హింస పెరగలేదని ఆయన అన్నారు.

READ MORE: CM Chandrababu: విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయి..

హింసాత్మక దాడుల్లో 19 మంది విద్యార్థులు..
విదేశాల్లో జరిగిన హింసాత్మక దాడుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి తెలిపారు. గణాంకాల ప్రకారం.. కెనడాలో అత్యధికంగా 9 మంది విద్యార్థులు మరణించారు. ఆ తర్వాత అమెరికాలో 6 మంది విద్యార్థులు, ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా, కిర్గిస్థాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. విదేశాల్లోని ఇండియన్ మిషన్/పోస్ట్‌కు అవాంఛనీయ సంఘటనల కేసులు వచ్చినప్పుడు, వెంటనే ఆ దేశ సంబంధిత అధికారులతో సమాచారం తీసుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Exit mobile version