PM Narendra Modi: 5జీ టెక్నాలజీ విద్యను మరో స్థాయికి తీసుకెళ్తుంది..
PM Narendra Modi: 5G టెలికాం సేవ దేశంలోని విద్యా వ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజా సాంకేతికత స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్రూమ్లు, స్మార్ట్ టీచింగ్లకు మించినది అని ప్రధాని అన్నారు. కొత్త విద్యా విధానం ఆంగ్ల భాష చుట్టూ ఉన్న బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని బయటకు తీస్తుందని కూడా ఆయన చెప్పారు. గుజరాత్లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఇంగ్లీషు భాష కేవలం కమ్యూనికేషన్ మాధ్యమం అయినప్పటికీ ఇంగ్లీషు పరిజ్ఞానం మేధోసంపత్తికి చిహ్నంగా పరిగణించబడుతుందని ఆయన సూచించారు.
ఈ మిషన్ గుజరాత్లో కొత్త తరగతి గదులు, స్మార్ట్ క్లాస్రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, రాష్ట్రంలోని పాఠశాలల మౌలిక సదుపాయాలను మొత్తంగా అప్గ్రేడ్ చేయడం ద్వారా విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని పీఎం వెల్లడించారు. విద్యార్థులు ఇప్పుడు 5G సేవ సహాయంతో తమ పాఠశాలల్లో వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇతర అత్యాధునిక సాంకేతికతలను అనుభవించవచ్చని ఆయన అన్నారు. ఇంగ్లీషులో అసౌకర్యంగా ఉన్నవారు వెనుకబడిపోకుండా చూసుకోవడానికి స్థానిక భాషలను ఉపయోగించాలని ప్రధానమంత్రి సూచించారు. యువకులు ఇప్పుడు ఇతర భాషల్లో చదువుకునే అవకాశం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
Also Read
Rupee Drops : రూపాయి కొత్త చరిత్ర.. 83 కూడా దాటేసింది..
పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోయినా వైద్యులు, ఇంజినీర్లు కావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంగ్ల భాష లేకపోవడం వల్ల ఎవరూ వెనుకబడి ఉండకూడదని తాము కోరుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో గుజరాత్ విద్యారంగంలో తీవ్ర మార్పును చవిచూసిందని ప్రధాని అన్నారు. గత రెండు దశాబ్దాలలో, గుజరాత్ ప్రభుత్వం 1.25 లక్షల కొత్త తరగతి గదులను నిర్మించిందన్నారు. దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులను చేర్చుకుందని, దశాబ్దం క్రితం ఇప్పటికే 15,000 తరగతి గదులలో టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేయబడ్డాయన్నారు.
మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం 50,000 కొత్త తరగతి గదులను నిర్మిస్తుందని, 5G సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న దాదాపు 1 లక్ష తరగతి గదులను స్మార్ట్ క్లాస్రూమ్లుగా మారుస్తుందని అని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ మిషన్ వల్ల గ్రామాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారని ప్రధాని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద విద్యార్థులను చిన్న వయస్సు నుండే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంతోపాటు ఆర్ట్స్, రోబోటిక్స్ వంటి ఇతర విషయాలపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. గుజరాత్లో విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రిగా తాను ‘శాల ప్రవేశోత్సవ్’, ‘గుణోత్సవ్’ వంటి అనేక పథకాలను ప్రారంభించానని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో