PM Narendra Modi: 5జీ టెక్నాలజీ విద్యను మరో స్థాయికి తీసుకెళ్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: 5G టెలికాం సేవ దేశంలోని విద్యా వ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజా సాంకేతికత స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్రూమ్లు, స్మార్ట్ టీచింగ్లకు మించినది అని ప్రధాని అన్నారు. కొత్త విద్యా విధానం ఆంగ్ల భాష చుట్టూ ఉన్న బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని బయటకు తీస్తుందని కూడా ఆయన చెప్పారు. గుజరాత్లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఇంగ్లీషు భాష కేవలం కమ్యూనికేషన్ మాధ్యమం అయినప్పటికీ ఇంగ్లీషు పరిజ్ఞానం మేధోసంపత్తికి చిహ్నంగా పరిగణించబడుతుందని ఆయన సూచించారు.
ఈ మిషన్ గుజరాత్లో కొత్త తరగతి గదులు, స్మార్ట్ క్లాస్రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, రాష్ట్రంలోని పాఠశాలల మౌలిక సదుపాయాలను మొత్తంగా అప్గ్రేడ్ చేయడం ద్వారా విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని పీఎం వెల్లడించారు. విద్యార్థులు ఇప్పుడు 5G సేవ సహాయంతో తమ పాఠశాలల్లో వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇతర అత్యాధునిక సాంకేతికతలను అనుభవించవచ్చని ఆయన అన్నారు. ఇంగ్లీషులో అసౌకర్యంగా ఉన్నవారు వెనుకబడిపోకుండా చూసుకోవడానికి స్థానిక భాషలను ఉపయోగించాలని ప్రధానమంత్రి సూచించారు. యువకులు ఇప్పుడు ఇతర భాషల్లో చదువుకునే అవకాశం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
Also Read
Rupee Drops : రూపాయి కొత్త చరిత్ర.. 83 కూడా దాటేసింది..
పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోయినా వైద్యులు, ఇంజినీర్లు కావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంగ్ల భాష లేకపోవడం వల్ల ఎవరూ వెనుకబడి ఉండకూడదని తాము కోరుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో గుజరాత్ విద్యారంగంలో తీవ్ర మార్పును చవిచూసిందని ప్రధాని అన్నారు. గత రెండు దశాబ్దాలలో, గుజరాత్ ప్రభుత్వం 1.25 లక్షల కొత్త తరగతి గదులను నిర్మించిందన్నారు. దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులను చేర్చుకుందని, దశాబ్దం క్రితం ఇప్పటికే 15,000 తరగతి గదులలో టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేయబడ్డాయన్నారు.
మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం 50,000 కొత్త తరగతి గదులను నిర్మిస్తుందని, 5G సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న దాదాపు 1 లక్ష తరగతి గదులను స్మార్ట్ క్లాస్రూమ్లుగా మారుస్తుందని అని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ మిషన్ వల్ల గ్రామాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారని ప్రధాని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద విద్యార్థులను చిన్న వయస్సు నుండే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంతోపాటు ఆర్ట్స్, రోబోటిక్స్ వంటి ఇతర విషయాలపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. గుజరాత్లో విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రిగా తాను ‘శాల ప్రవేశోత్సవ్’, ‘గుణోత్సవ్’ వంటి అనేక పథకాలను ప్రారంభించానని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!