Russia-Ukraine War: పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్ నగరం.. తెల్లవారుజామునే రష్యా భీకర దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సెంట్రల్ సిటీ ఉమాన్లో, క్షిపణి ఒక అపార్ట్మెంట్ భవనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని ఆ ప్రాంతంలోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఇహోర్ టబురెట్స్ చెప్పారు.సెంట్రల్ సిటీ డ్నిప్రోలో క్షిపణి ఒక ఇంటిని ఢీకొట్టింది. ఈ దాడిలో ఓ చిన్నారి, ఓ యువతి మరణించారని మేయర్ బోరిస్ ఫిలాటోవ్ టెలిగ్రామ్లో తెలిపారు. ఈ దాడిలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
కైవ్ నగరం కూడా పేలుళ్లతో దద్దరిల్లింది. వైమానిక దాడి సైరన్లతో పాటు పేలుళ్లు దేశవ్యాప్తంగా జరిగినట్లు తెలిసింది. కీవ్ ప్రాంతంలోని ఉక్రెయింకా పట్టణంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. విమాన నిరోధక యూనిట్లు 11 క్షిపణులు, రెండు డ్రోన్లను ధ్వంసం చేశాయని.. శిథిలాలు విద్యుత్ లైన్ను దెబ్బతీశాయని రాజధాని సైనిక పరిపాలన విభాగం తెలిపింది. మధ్య ఉక్రెయిన్లోని డ్నిప్రో, క్రెమెన్చు, పోల్టావా, దక్షిణాన మైకోలైవ్లలో కూడా అర్ధరాత్రి తర్వాత పేలుళ్లు సంభవించాయని ఇంటర్ఫాక్స్ తెలిపింది.
Also Read
- Sheikh Hasina: "నరహంతకురాలు".. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
Read Also: Sudha Murty: నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది..
ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ తూర్పు నగరమైన బఖ్ముత్ను హస్తగతం చేసుకునేందుకు కొన్ని నెలలుగా రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నగరాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఇరుపక్షాల పోరులో బఖ్ముత్ శిథిలాల దిబ్బగా మారింది. ఈ నగరాన్ని దాదాపు ఆక్రమించుకునే దశకు రష్యా చేరుకుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య బుధవారం టెలిఫోన్ కాల్ను ప్రస్తావిస్తూ, సంఘర్షణకు ముగింపు పలికే ఏదైనా దానిని స్వాగతిస్తామని క్రెమ్లిన్ చెప్పిన ఒక రోజు తర్వాత శుక్రవారం రష్యా దాడులు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత నేతలు మాట్లాడటం ఇదే తొలిసారి.కానీ ఉక్రెయిన్లో తన “ప్రత్యేక సైనిక ఆపరేషన్” లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని క్రెమ్లిన్ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరిలో 24, 2022న ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!