NTV Telugu Site icon

Road Accident: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి!

Nalgonda Road Accident

Nalgonda Road Accident

5 Dead in Nalgonda Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు నిడమానుర్ మండలం వేంపాడు స్టేజ్ పక్కనే ఉన్న చౌదరి హోటల్ వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Also Read: Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 8 గంటల సమయం!

మృతులు పెద్దవుర మండలం పుల్య తండాకు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు అని తెలుస్తోంది. మృతులు రమవత్ కేశవులు (19), రమవత్ పాండ్య (40), రమవత్ గణ్య (40), రమవత్ బుజ్జి (38)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి పది గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా.. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చూడటానికి వస్తున్న కుటుంబ సభ్యుల ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ మరణాలతో పుల్య తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.