Kerala : 42 మంది మహిళలను ముక్కలుగా నరికి పోలీస్ స్టేషన్ దగ్గర పడేసిన సీరియల్ కిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala : ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి, వాటి గురించి విన్నప్పుడు గూస్బంప్స్ వస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక కేసు వైరల్ అవుతోంది. ఇందులో కెన్యాలో 42 మంది మహిళలను దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ను అరెస్టు చేశారు. కేవలం రెండేళ్లలో ఈ మహిళలందరినీ ఈ వ్యక్తి హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ మానవ మృగం చేసిన దారుణం గురించి విన్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు. దీని సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. తొలుత తన భార్య హత్యతో ఈ దారుణాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Read Also:Warangal Bhadrakali Temple: శాకంబరీ అలంకరణలో భద్రకాళీ అమ్మవారు.. ఆలయానికి పోటెత్తిన భక్తులు!
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
రెండు సంవత్సరాలలో 42 మంది మహిళలను చంపినందుకు 33 ఏళ్ల కెన్యాకు చెందిన కొల్లిన్స్ జుమేసి ఖలుషా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహిళలను తన వలలో పడేసుకుని హత్య చేసేవాడని వెలుగులోకి వచ్చింది. యూరో 2024 ఫుట్బాల్ ఫైనల్ను చూడటానికి వెళ్లిన క్లబ్ వెలుపల తెల్లవారుజామున 3 గంటలకు అతన్ని అరెస్టు చేశారు. ఈ హత్యలన్నీ తానే చేసినట్లు అంగీకరించినట్లు విచారణ అధికారి మహ్మద్ అమీన్ వెల్లడించారు. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను పోలీస్ స్టేషన్ సమీపంలోని డంపింగ్ ప్రదేశంలో పారేస్తానని కొల్లిన్స్ వెల్లడించినట్లు ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మృతదేహాలు బాగా ఛిద్రమై, కుళ్లిపోయి, తలలు లేని మొండెలను గుర్తించారు. కొందరి మృతదేహాలను ముక్కలుగా నరికి గోనె సంచులలో వేసి విసిరేశారు.
Read Also:YS Jagan: నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
కొల్లిన్స్ జుమాసీ ఖలుషా ఒక సీరియల్ కిల్లర్ అని మహమ్మద్ అమీన్ వెల్లడించాడు. కాలిన్స్ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తన నివేదికలో చెప్పాడు. అతని గదిలో ఒక కత్తి, 12 నైలాన్ బస్తాలు, రెండు రబ్బరు గ్లౌజులు, ఒక హార్డ్ డ్రైవ్, ఎనిమిది స్మార్ట్ఫోన్లు లభించాయి. ఖలుషా మొదట తన భార్యను చంపినట్లు వెల్లడించాడు. ఇదంతా ఎలా మొదలైందో చెప్పాడు. మొదట తన భార్యను గొంతుకోసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనె సంచులలో వేసి పడేశాడని చెప్పాడు. దీని తరువాత అతను ఆనందించడం ప్రారంభించాడు. దీని తరువాత అతను చాలా మంది మహిళలను చంపాడు. హత్యకు గురైన వారిలో ఒకరి ఫోన్ను స్వాధీనం చేసుకున్నప్పుడు కాలిన్స్ జుమాసి ఖలుషాను కనుగొన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అతను తన ఖాతాకు కొంత డబ్బును కూడా బదిలీ చేసినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!