Meat Plant : పంజాబ్ లో ఘోరం.. మీట్ ప్లాంట్లో నలుగురు కూలీలు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meat Plant : పంజాబ్లోని డేరా బస్సీలోని ఫెడరల్ మీట్ ప్లాంట్లో శుక్రవారం మధ్యాహ్నం గ్రీజు ట్యాంక్ను శుభ్రం చేస్తున్న నలుగురు కార్మికులు మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నలుగురు కూలీలు ఒకరి తర్వాత ఒకరు గ్రీజు ట్యాంక్లోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విషపూరిత పొగ వెలువడింది. దాన్న పీల్చి నలుగురు చనిపోగా.. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. కాలక్రమేణా ట్యాంక్లో పేరుకుపోయిన గ్రీజును శుభ్రం చేయడానికి ఒక కార్మికుడు ట్యాంక్లోకి ప్రవేశించాడు. మొదటి వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో, రెండవవాడు లోపలికి వెళ్లాడు. అయితే అతను కూడా విషపూరిత పొగను పీల్చాడు. దీంతో సృహతప్పి పడిపోయాడు.
అతను రాకపోవడంతో ఆ తర్వాత.. మరో ఇద్దరు కార్మికులు ట్యాంక్లోకి ప్రవేశించారు. వారంతా అస్వస్థతకు గురయ్యారు. ట్యాంకులోకి వెళ్లిన వారంతా బయటకు రాకపోవడంతో వారికి ఏమైందో తెలుసుకునేందుకు తాను వెళ్లినట్లు అస్వస్థతకు గురైన వారిలో ఒకరు వివరించారు. ‘ఎవరూ బయటకు రాకపోవడంతో నేను ట్యాంక్లోకి ప్రవేశించి విషపూరిత పొగలు పీల్చి స్పృహతప్పి పడిపోయాను. తర్వాత స్థానికంగా ఉన్న వారు నన్ను రక్షించారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. కానీ మిగిలిన నలుగురు కూలీలు విషపూరిత పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారు.” అని చెప్పాడు. మృతులను మనక్, శ్రీధర్ పాండే, కుర్బన్, జనక్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను డేరా బస్సీ సివిల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
తాజావార్తలు
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!