Site icon NTV Telugu

Road Accident: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!

Road Accident

Road Accident

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి.. బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

Also Read: Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..

ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ‘నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఆటో బోల్తాపడి ఆదోనికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.

Exit mobile version