Nityanand Rai : చనిపోయిన 3351మంది సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ సైనికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nityanand Rai : దేశవ్యాప్తంగా జనవరి 1, 2018 నుండి డిసెంబర్ 1, 2023 వరకు మొత్తం 3351 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (AR) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 275 మంది సైనికులు చర్యలో మరణించగా, 3076 మంది డ్యూటీలో మరణించారు. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పార్లమెంటులో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ.. అమరవీరులైన CAPF, అస్సాం రైఫిల్స్ సైనికుల కుటుంబాలకు ఇచ్చే కేంద్ర ఎక్స్గ్రేషియా మొత్తాన్ని 15 లక్షల రూపాయల నుండి 35 లక్షల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. కాగా విధి నిర్వహణలో అమరులైతే రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1939 ప్రకారం, అమరవీరులైన సైనికుల తదుపరి బంధువులు సరళీకృత కుటుంబ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులని ఆయన చెప్పారు.
Read Also:Guntur Kaaram: ఇవెక్కడి సెంటిమెంట్లు… మహేష్ ఫ్యాన్స్ కి భయమా?
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
2016 నుంచి 2020 వరకు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 355 మంది సైనికుల్లో అత్యధికంగా 209 మంది సైనికులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన వారేనని మంత్రి తెలిపారు. మంత్రి నిత్యానంద్ రాయ్ అందించిన సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్కు చెందిన 78 మంది, ఐటీబీపీకి చెందిన 16 మంది, సశాస్త్ర సీమా బల్కు చెందిన ఎనిమిది మంది, సీఐఎస్ఎఫ్కి చెందిన ఏడుగురు, అస్సాం రైఫిల్స్కు చెందిన 37 మంది సైనికులు వీరమరణం పొందారు. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 1, 2023 వరకు దేశవ్యాప్తంగా 3351 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఎఆర్) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో మరోసారి లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు.
Read Also:Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!