Delhi: రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరంగా ఏడీఆర్ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరమైన ఏడీఆర్ నివేదిక వెలువడింది. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో (Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల డేటాను విశ్లేషించిన తర్వాత ఏడీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.19,602గా ఉన్నాయని తెలిపింది.
ఇద్దరు ఎంపీలపై మాత్రం హత్య, నలుగురు ఎంపీలపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 75 (33 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 40 (18 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. క్రిమినల్ కేసులున్న వారిలో బీజేపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన 28 మంది ఎంపీలలో 50 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయి.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 13 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు (38 శాతం), ఆర్జేడీ నుంచి ఆరుగురిలో నలుగురు (67 శాతం), సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురు (80 శాతం) నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారు. ఆప్కి చెందిన 10 మంది ఎంపీలలో 30 శాతం మంది, వైఎస్సార్సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులలో నలుగురు (36 శాతం), డీఎంకే 10 మంది ఎంపీల్లో ఇద్దరు (20 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్లో సమర్పించారు.
ఇక ఎంపీల నేర చరిత్రతో పాటు రాజ్యసభ సభ్యుల ఆస్తులపై కూడా వెల్లడించింది. ఒక్కో ఎంపీకి సగటున రూ.87.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. 90 మంది సభ్యులున్న బీజేపీకి చెందిన 9 మంది, కాంగ్రెస్ 4 మంది, వైసీపీ అయిదుగురు, ఆప్, బీఆర్ఎస్, ఆర్జేడీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు రూ.100 కోట్లకుపైనే ఆస్తులు కలిగి ఉన్నారు. పార్టీల వారీగా బీజేపీ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.3,360 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.1,139 కోట్లు, వైఎస్సార్సీపీ (YSRCP) ఎంపీల ఆస్తులు రూ.3,934 కోట్లు, బీఆర్ఎస్ (BRS) ఎంపీల ఆస్తులు రూ.5,534 కోట్లు, ఆప్ ఎంపీల ఆస్తులు రూ.1,148 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఒక స్థానం, జమ్ము కశ్మీర్ నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు ఎంపీల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో ఏడీఆర్ వారి డేటాను విశ్లేషించలేదు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!